పర్యాటకుల కోసం అవస్థలు పడుతున్న మాల్దీవ్స్! దేశాన్ని సందర్శించమంటూ టూరిస్ట్ లకు విజ్ఞప్తి! తగ్గిపోతున్న ఆదాయం!
Sun May 26, 2024 10:45 Travel.202405265518.jpg)
పర్యావరణ మార్పుల కారణంగా అవస్థలు పడుతున్న మాల్దీవులకు అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక సాయం అందట్లేదని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించేందుకు తమకు ధనిక దేశాల సాయం కావాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని తెలిపారు. కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు ప్రథమస్థానంలో ఉంటోందని ముయిజ్జు ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక దేశాలు మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవుల లాంటి దేశాలను ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పర్యాటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీప దేశాలు ప్రతి ఐదేళ్లకొకసారి సమావేశమై అభివృద్ది చర్యలపై చర్చిస్తాయి. తాజాగా మాల్దీవులు, ఆటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే కేవలం 14 శాతం ఆదాయం మాత్రమే ఎస్ఐడీఎస్ దేశాలకు వస్తోందని ముయిజ్జు ఈ సందర్భంగా అన్నారు. సముద్ర మట్టాల పెరుగుదలతో కలిగే నష్టాన్నీ భర్తీ చేసుకునేందుకు తమకు 500 మిలియన్ డాలర్ల నిధులు కావాలని ముయిజ్జు పేర్కొన్నాడు. ధనిక దేశాల సాయం లేకుండా ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమని పేర్కొన్నారు. ఇక పర్యావరణ మార్పుల నుంచి బయటపడేందుకు మాల్దీవులు అనేక చర్యలు చేపడుతోంది. దాదాపు 30 వేల అపార్ట్ మెంట్లతో రాస్ మాలే పేరిట ఓ కృత్రిమ ద్వీపాన్ని నిర్మించింది. ఇందులో అనేక నిర్మాణాలను చైనా సంస్థలకే కట్టబెట్టింది.
ఇవి కూడా చదవండి:
ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఓర్లి ఎయిర్ పోర్ట్! 70 శాతం విమాన సర్వీసులు రద్దు! సిబ్బంది సమ్మెతో!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Travel #AirTravel #Maldives #India #Tourism #Tourists #Travellers
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.