ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలాలకు మరొక బ్యాడ్ న్యూస్! తాజాగా వాటిపై మరో దేశం నిషేధం!

Header Banner

ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలాలకు మరొక బ్యాడ్ న్యూస్! తాజాగా వాటిపై మరో దేశం నిషేధం!

  Fri May 17, 2024 11:49        Recipes

పాప్యులర్ భారతీయ బ్రాండ్లు ఎవరెస్టు, ఎమ్‌డీఎహ్ మసాలా ఉత్పత్తులపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది. ఈ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథిలీన్ ఆక్సైడ్ క్రిమిసంహారకాన్ని గుర్తించిన నేపాల్ వీటిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్‌లు ఈ మసాలా బ్రాండ్‌పై నిషేధం విధించాయి. దీంతో, తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై నేపాల్‌కు చెందిన ఆహార నియంత్రణ సంస్థ పరీక్షలు ప్రారంభించింది. ఈ అధ్యయనంలో అధికారులు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను గుర్తించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకూ నిషేధం కొనసాగుతుందని నేపాల్ అధికారులు పేర్కొన్నారు. ఈ బ్రాండ్ల దిగుమతులు, అమ్మకాలపై నిషేధం విధించినట్టు చెప్పారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భారతీయులకు చిరపరిచితమైన ఎవరెస్టు, ఎండీహెచ్ మసాలాలు విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. అయితే, వీటిల్లో ఇథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ) ఉన్నట్టు హాంకాంగ్, సింగపూర్‌లు తొలిసారిగా గుర్తించాయి. ఆహార ఉత్పత్తుల స్టెరిలైజేషన్‌కు ఈ రసాయనాన్ని వినియోగించేవారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో.. సాల్మొనెల్లా అనే హానికారక బ్యాక్టీరియాతో కలుషితం కాకుండా ఉండేందుకు ఈటీఓను వాడేవారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన అనేక దేశాలు ఈ రసాయనం వాడకంపై నిషేధం విధించాయి. 

 

థాయిలాండ్: త్వరలో మునిగిపోనున్న రాజధాని! రక్షణకై వివిధ రకాల భారీ ప్రణాళికలు! ఆందోళన కలిగిస్తున్న సముద్ర మట్టాలు! 

 

మరోవైపు, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా ఈ బ్రాండ్స్‌పై దృష్టిసారించాయి. ఈ విషయమై గురువారం బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే మసాలాల్లో నిషేధిత క్రిమిసంహారకాలు ఉన్నాయో లేదో తేల్చేందుకు గతేడాది నుంచీ పటిష్ఠ చర్యలు ప్రారంభించామని పేర్కొంది.

 

ఇవి కూడా చదవండి: 

ఓరి దేవుడో! పిల్ల ఏనుగుకు ఇంత సెక్యూరిటీ నా! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! 

 

ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన! 

 

అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్! 

 

సింగపూర్: అదృష్టం అంటే ఇలా ఉండాలి! ఎయిర్ లైన్ చరిత్రలో ఇది అత్యధిక బోనస్! 

 

విజయనగరం: వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్! అభ్యర్థుల ఆందోళన! నిలదీసిన టీడీపీ నేతలు 

 

ఎన్నికల్లో హింస రీత్యా 12 మంది అధికారులపై ఈసీ వేటు!! వివరాలు ఇవే 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #World #IndianSpices #MDHMasala #EverestMasala