తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీసీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పటికే పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్ ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా హైదరాబాద్ కు చెందని పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ ఏర్పాటులో ఆయనది ముఖ్య పాత్ర అని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటికే అరెస్టయిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. ఈ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్యు పరీక్షల్లో బయటపడిందని తెలిపారు. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
58 లోక్సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!
ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్! 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్! ఫాన్స్ లో ఉత్కంఠ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: