చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక! ఓటింగ్ కు 7 గురు ఎంపీలు దూరం!

Header Banner

చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక! ఓటింగ్ కు 7 గురు ఎంపీలు దూరం!

  Wed Jun 26, 2024 09:48        Politics

అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్ సభ స్పీకర్ ఎన్నిక తప్పట్లేదు. బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే, ఏడుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయలేదు. అందులో ఇండియాకు కూటమికి చెందిన వారు ఐదుగురు ఉండగా.. మరో ఇద్దరు స్వతంత్రులు. శశిథరూర్, శత్రుఘ్న సిన్హా లాంటి ప్రముఖులు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే, లోక్ సభ సభ్యులుగా ప్రమాణం చేయని వారు స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో స్పీకర్ ఎన్నికపై వీరి ప్రభావం చూపెట్టనుందా అనే చర్చ నడుస్తోంది.

 

ఇంకా చదవండిఅసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి! ఆచంట సునీత సంచలన వ్యాఖ్యలు!

 

అయితే, ఈ ఏడుగురు ఎంపీలు ప్రమాణం చేయకపోవడం అనే విషయం స్పీకర్ ఓటింగ్ పై ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువ అని విశ్లేషకులు చెప్తున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు వైఎస్ఆర్ సీపీకి చెందిన నలుగురు ఎంపీల మద్దతు బీజేపీకే ఉంది. అకాలీదళ్ ఎంపీల మద్దతు కోసం బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి రాజస్థాన్ ఎంపీ ఓం బిర్లాను, ఇండియా కూటమి కేరళ ఎంపీ కే. సురేశ్ ను బరిలో దింపాయి.

 

ఇవి కూడా చదవండి 

కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన! పూర్తి షెడ్యూల్ ఇదే! 

 

ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక! ఎన్డీయేకి వైసీపీ మద్దతు? 

 

రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే! 

 

క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్! 

 

అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్! 

 

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే! 

 

షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే! 

 

జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు! 

 

‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక! 

 

మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త! 

                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #BJP #Congress #NDA #India #Modi #RahulGandhi