ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు భూమి! లక్షల కోట్లు మింగిన అవినీతి వైసీపీ! యుద్ధానికి సిద్ధం!

Header Banner

ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు భూమి! లక్షల కోట్లు మింగిన అవినీతి వైసీపీ! యుద్ధానికి సిద్ధం!

  Mon Feb 12, 2024 18:02        Exclusives

ఏపీలో వైసీపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

అధికార మదంతో ఉన్న ఈయన యుద్ధానికి సిద్ధం అంటూ బహిరంగ సభలో ప్రారంభించారు.

ప్రపంచంలో ఎక్కడైనా అధికార పార్టీపై ప్రతిపక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి కానీ ప్రతిపక్షాలపై యుద్ధానికి సిద్ధం అంటూ ఈయన నినాదం పిచ్చి చేష్టలులా ఉన్నాయి.

ప్రజలకు అందనంత ఎత్తులో డయాస్ ఫై నిలబడి ఐదేళ్లుగా పాడుతున్న పాచి పాటలే పాడుతూ ప్రజలకు ఏం చేసింది చెప్పుకోలేని దుస్థితిలో ఈయన ఉన్నారు.

రాష్ట్ర ప్రజలు ఈయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పలు ప్రశ్నలతో నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈయన పాలలో వందల మంది దళిత సోదరుల ప్రాణాలను బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని వారి అనుచరులను "జైలుకు" పంపడానికి మేము సిద్ధం అంటున్నారు

ఎస్సీల అభివృద్ధి కొరకు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పలు పథకాలను రద్దు చేసిన ఈయన అంతానికి మేము సిద్ధం అంటున్నారు దళితులు.

నాసిరక మద్యంతో 3,40,000 మంది ప్రాణాలు బలిగొన్ని, 35 లక్షల మంది ప్రజలను అనారోగ్యం పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కుర్చీ దింపడానికి మేము సిద్ధం అంటున్నారు బాధిత కుటుంబాలు.

ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు భూమి పట్టాలలో లక్షల కోట్లు అవినీతి చేసిన ఈయన పై యుద్ధానికి సిద్ధం అంటున్నారు రాష్ట్ర ప్రజలు.

సచివాలయం రంగుల పేర్లుతో 2800 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినందుకు ఈయన్ని జైలుకి పంపడానికి మేము సిద్ధం అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో దేశ అభివృద్ధిలో కీలకంగా ఉండే యువత శక్తిని నిర్వీర్యం చేసినందుకు ఈయన్ని ఓటు ఆయుధంగా శిక్షించడానికి సిద్ధం అంటున్నారు యువత.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

10 లక్షలు కూడా విలువ చేయలేనటువంటి భూములను 70 లక్షలకు ప్రజాదనంతో కొని అది కూడా నివసించడానికి విలు లేనటువంటి లోతట్టు ప్రాంతంలో సెంటు భూములు ఇచ్చి ప్రజలతో చెలగాటమాడుతున్న జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి మేము సిద్ధం అంటున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు.

ఐదేళ్ల క్రితం నిర్మాణాలు పూర్తి కావచ్చిన టిడ్కో ఇళ్లను ప్రజలకు పంచకుండా వాటిని కరోనా సెంటర్లుగా మార్చినందుకు ఈయన పై లబ్ధిదారులు పోరాటానికి సిద్ధం అంటున్నారు.

అమరావతికి 33 వేల ఎకరాలు ఇచ్చి 1500 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతన్నలు రాష్ట్రంలో జగన్ పాలన అంతం మా పంతం అంటూ జగన్తో 1500 రోజులగా యుద్ధం చేస్తూనే ఉన్నారు.


ప్రతిపక్షాల పైన 250 తప్పుడు కేసులు పెట్టి....
వాటి పైన వాదించడానికి లాయర్లకు కొన్ని వందల కోట్లు రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినందుకు నిన్ను జైలు కు పంపడానికి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈయన తో యుద్ధానికి సిద్ధం అంటున్నాయి.

గ్రామ గ్రామాన విస్తరించిన సహజ వనరులను దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడడానికి వచ్చే ఎన్నికలలో వైసిపి ఓటమికి సిద్ధం.

ఐదేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగులను పెంచి అభివృద్ధిని అట్టడుగుకు చేర్చిన ఈయన నిరుద్యోగుల చేతిలో ఓటమికి సిద్ధంగా ఉండాలంటున్నారు.

ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ఈయన తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు జరగకుండా ఈయన అధికార పీట నుంచి దింపి పాలస్కే పరిమితం చేయడానికి రాష్ట్ర రైతులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

54 రోజులుగా తిండి తిప్పలు లేకుండా పండుగలు చేసుకోనియకుండా అంగన్వాడీలను వేధింపులకు గురి చేసిన ఈయన ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం అంటున్నారు.

రాష్ట్రానికి జీవన నాడి ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పడకేసినందుకు ఈయన్ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధం అంటున్నారు.

దేశ చిత్రపటంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపినందుకు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధం అంటున్నారు.

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #BabuSuper6 #andhrapradesh #