కువైట్: సౌమ్యుడు, అందరివాడు, NRI TDP నేత JD ప్రసాద రావు ఆకస్మిక మృతి! పలువురు దిగ్భ్రాంతి!
Fri Feb 23, 2024 18:21 Kuwait
కువైట్ లో ఈ రోజు ఒక విషాదం చోటు చేసుకుంది. కువైట్ లో నివసిస్తున్న ఎంతో మందికి ఆప్తుడు అయిన శ్రీ జే.డీ ప్రసాద్ రావు గారు ఇవాళ కన్నుమూశారు. జే.డీ ప్రసాద్ రావు గా అందరికీ పరిచయం ఉన్న ఆయన అసలు పేరు జాస్తి డినకర గోపాల ప్రసాద్ రావు. వీరి స్వస్థలం విజయవాడ. దాదాపు 40 సంవత్సరాల నుండి కువైట్ లో నివసిస్తున్న ప్రసాద్ గారు సమాజం లో ఎంతో పేరు ఉన్న వ్యక్తి. ఆయన పిల్లలు కూడా కువైట్ లోనే నివసిస్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న ప్రసాద్ గారు ఎంతో గొప్ప వ్యక్తి.
మరి కొన్ని తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అందరితో కలిసిమెలిసి ఉంటారు, ఎంతో సౌమ్యుడు, దయా హృదయం కలిగిన వ్యక్తి. కువైట్ లో ఉన్న ఎన్నో తెలుగు ఆర్గనైజేషన్స్ లో తన వంతు సహాయ సహకారాలు అందించారు. తెలుగు కళా సమితి కువైట్ లో ఎన్నో సంవత్సరాలు సేవ చేశారు. అలాగే తెలుగు దేశం అనుబంధ సంస్థ అయినటువంటి ప్రవాసాంధ్ర తెలుగు దేశం లో స్థాపించిన అప్పటినుంచి ఇప్పటివరకూ పలు రకాల సేవలు అందిస్తూ వచ్చారు. పరాయి దేశం లో అందరికీ ఒక పెద్ద దిక్కు గా ఉంటూ, నలుగురికి మంచి మాటలు చెప్తూ, సలహాలు, ఆర్థిక సహాయాలు అందిస్తూ ఒక ఆదర్శంగా నిలిచారు.
కువైట్ లో ఖాళీగా ఉన్న 18,000 భవనాలు! డిసెంబర్ 2023 నాటికి! అయినా అద్దెలు ఆకాశం లో
ఇటీవల ఆయన ఆరోగ్యం పరిస్తితి క్షీణించింది. హాస్పిటల్ లో చికిత్స అందించి, ఆరోగ్యం మెరుగు పడింది అని 3 రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చారు. అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఆయన హఠాత్తుగా ఈ రోజు ఉదయం (ఫిబ్రవరి 23, 2024) మృతిచెందారు. ఆయన మరణం కువైట్ లో ఉన్న తెలుగు వారికి అందరికీ కూడా తీరని లోటు. ప్రతి కార్యక్రమంలో ఎంతో చురుకుగా హాజరు అయ్యి అందరినీ ఆప్యాయంగా పలకరించే వారు ఇలా హఠాత్తుగా మరణించడం ఎంతో బాధాకరమైన విషయం.
కువైట్: క్రాకర్ లు అమ్ముతూ పట్టుబడిన పలువురు ప్రవాసులు! కఠిన శిక్షలు తప్పవు!
ఆయన మరణ వార్త విని చాలా మంది తమ బాధను తెలుపుతూ ఆయనతో ఉన్న వారి అనుబంధాన్ని నేమర వేసుకుంటున్నారు. వారి మృతదేహం ప్రస్తుతం మార్చురీ లో ఉంది అని, దహన సంస్కారాలు వివరాలు త్వరలో తెలియచేయడం జరుగుతుంది అని కుటుంబ సభ్యులు తెలియచేశారు. శ్రీ జే. డీ ప్రసాద్ గారి అకాల మరణానికి చింతిస్తూ, వారి భార్య జాస్తి శైలజ కుమారి గారికి, వారి కుమారుడు కృష్ణ, వారి కుమార్తె అనిత, మరియు బందువులు అందరికీ కూడా ఆంధ్ర ప్రవసి తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము, వారి ఆత్మ కి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
కువైట్: ప్రైవేట్ కంపెనీ లలో ప్రవాసులకు భారీగా తగ్గనున్న ఉద్యోగ అవకాశాలు! కువైటీల కొరకు!
అదే విధంగా శ్రీ ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియచేయాలని అనుకున్నవారు కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి తమ సంతాపాన్ని తెలియచేయ వలసిందిగా కోరుతున్నాము. మీ సంతాప సందేశాలను తర్వాత వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. మీ సంతాపాన్ని తెలలియచేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
పోలింగ్ బూత్ ల మార్పుపై ఏపీ హైకోర్టులో విచారణ
పేదలను దగా చేసిన జగన్ మళ్ళీ వస్తే జీవితాలు విచ్ఛిన్నమే: రామానాయుడు
టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్ బాబును పరామర్శించిన చంద్రబాబు!!
బీజేపీ మెడలు వంచుతామన్న జగన్! ఒక్క పోరాటం కూడా చేయలేదు -వైఎస్ షర్మిల
సీపీఎస్ ఉద్యోగులపై చిరాకు పడిన మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Condolences
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.