ఇది రాజకీయ ఆర్థిక కుట్ర... ఈసీ వాళ్లిద్దరిపై చర్యలు తీసుకోవాలి! ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పు..వర్ల రామయ్య

Header Banner

ఇది రాజకీయ ఆర్థిక కుట్ర... ఈసీ వాళ్లిద్దరిపై చర్యలు తీసుకోవాలి! ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పు..వర్ల రామయ్య

  Tue May 14, 2024 20:29        Politics

సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్‌బిఐ నుంచి రూ.4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకువచ్చిందని, ఆ డబ్బును జగన్ రెడ్డి తన బినామీ కాంట్రాకటర్లకు దోచిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. ఇంతటి రాజకీయ ఆర్థిక కుట్రలో భాగ్యులైన సీఎస్ జవహర్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ...”ఏపీఎండీసీ ద్వారా వచ్చిన రూ.7 వేల కోట్లు, ఇప్పుడు కొత్తగా తీసుకున్న రూ.4 వేల కోట్లను జగన్ తన సొంత, బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలనే దుర్మార్గపు ఆలోచన ఇది. సీఎస్ జవహర్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలు ఇద్దరూ కుమ్మక్కై రాజకీయ ఆర్థిక కుట్రకు పాల్పడుతున్నారు. ఇది ఆర్థిక నేరం. ప్రైవేటు ఆసుపత్రులకు రావాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదు. పంచాయతీ రాజ్ ఛాంబర్‌కు రావల్సిన సుమారు రూ.8 కోట్లు ఇంతవరకు ఇవ్వలేదు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు: తర్వాత రోజు కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం! తిరుపతి మహిళా వర్సిటీ వద్ద ఉద్రిక్తత!

 

మెడికల్ రీఎంబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించలేదు. పోలీసులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏం తొందర వచ్చిందని హుటాహుటీన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పుడు చెల్లిస్తున్నారు? పద్ధతి ప్రకారం కాకుండా సొంత కాంట్రాక్టర్లను ఏరికోరి వారికే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ రాజకీయ ఆర్థిక కుట్రలో భాగస్తులైన సీఎస్ జవహర్ రెడ్డిని, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై గవర్నర్ గారికి మా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రేపు గవర్నర్‌ను కలిసి జగన్ రెడ్డి ప్రభుత్వం పన్నుతున్న కుట్రపై ఫిర్యాదు చేస్తాం” అని తెలిపారు. 

ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్యతో పాటు మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరి అఖిల్ తదితరులు ఉన్నారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ ఆలయంలో నాలుక కోసుకున్న వ్యక్తి! కూటమి 100 నుంచి 145 స్థానాల్లో గెలవాలని!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

 

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

 

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

 

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

 

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

 

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

 

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #VarlaRamaiah #APCEO #TDP #YSRCP #AndhraPradesh