Header Banner

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

  Wed Jun 04, 2025 10:35        Politics

ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేశారు. ఈ నెల 30 వరకు అదనపు బోగీలు అందుబాటులో ఉంటాయని వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖపట్నం-భువనేశ్వర్-విశాఖపట్నం (22820-22819), విశాఖపట్నం-బ్రహ్మపుర-విశాఖపట్నం (18526-18525), విశాఖపట్నం-కొరాపుట్-విశాఖపట్నం (18512-18511) ఇంటర్ సిటీ రైళ్లకు రెండు జనరల్, రెండు సెకండ్ క్లాస్ సిట్టింగ్ బోగీలు జత చేశారు. అలాగే విశాఖపట్నం-భవానిపట్న-విశాఖపట్నం (58504-58503), విశాఖ-గుణపూర్-విశాఖ (58506-58505), విశాఖపట్నం-రాయపూర్-విశాఖపట్నం (58528-58527), విశాఖపట్నం-కొరాపుట్-విశాఖపట్నం (58538-58537) రైళ్లకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ బోగీ జత చేశారు.

మరోవైపు శ్రీకాకుళం రోడ్ నుంచి చర్లపల్లికి నడిచే ప్రత్యేక రైలు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా నడుస్తుందని తెలిపారు. ఈ నెల 2న రాత్రి 7.30 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరాల్సిన శ్రీకాకుళం రోడ్‌-చర్లపల్లి (07426) ప్రత్యేక రైలు అర్ధరాత్రి ఒంటి గంటకు బయలుదేరుతుంద్నారు.


ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!


ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, రైళ్లలో అదనపు బోగీల సేవలను వినియోగించుకోవాలని సూచించారు రైల్వే అధికారులు. అలాగే రైళ్ల షెడ్యూల్‌ను కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. అంతేకాదు ఇప్పటికే వేసవి రద్దీని గమనించిన రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

మరోవైపు ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న రైలులో.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు రైల్వేస్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నంలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. సామర్లకోట రైల్వేస్టేషన్‌ దగ్గర ఆగిపోయింది. అక్కడ నుంచి బయలుదేరిన సమయంలో రైలు బోగి కింద పొగలు వచ్చాయి.. వెంటనే మేడపాడు రైల్వే సిబ్బంది, బిక్కవోలు రైల్వేగేటు సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలును బిక్కవోలు స్టేషన్‌లో ఉదయం 8.25 గంటలకు నిలిపివేశారు. డ్రైవర్, గార్డు పరిశీలించి బ్రేకులు పట్టేయడంతో ఒక బోగీ నుంచి పొగలు వచ్చాయని గుర్తించారు. అనంతరం బ్రేకుల్ని సరిచేసిన తర్వాత రైలు 17 నిమిషాల అనంతరం 8:42 గంటలకు బయలుదేరి గుంటూరు వెళ్లింది. రైలుకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని చెబుతున్నారు రైల్వే అధికారులు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APRailways #ExpressTrains #AdditionalCoaches #RailwayUpdate #TrainTravel #IndianRailways