హాస్పిటల్లో యాంకర్ రష్మీ.. ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్! ఆందోళనలో అభిమానులు!
Sun Apr 20, 2025 16:54 Others
యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకూ యాంకరింగ్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. యాంకరింగ్ లో అప్పట్లో ఉదయ భాను, ఆ తర్వాత సుమ, ప్రదీప్ ల తర్వాత మంచి పేరు తెచ్చుకుంది రష్మీ. సోషల్ మీడియాలో కూడా రష్మీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే గత కొద్ది నెలలుగా ఆమె ఆరోగ్యం ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి రష్మీ గౌతమ్.. తీవ్ర రక్తస్రావం, భుజం నొప్పితో బాధపడుతున్నట్లు ఇటీవల తెలిపింది. గత వారం రోజుల్లోనే ఆమె రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 9 కి పడిపోయినట్లు తెలిపింది. తన కమిట్ మెంట్స్ ను త్వరగా పూర్తి చేసుకుని.. ఆమె ఆస్పత్రిలో జాయిన్ అయింది. అయితే తాజాగా రష్మీ తనకు సర్జరీ జరిగింది అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. హాస్పిటల్ లో ఆపరేషన్ చేసేటప్పుడు వేసుకునే డ్రెస్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. అయిదు రోజుల్లోనే నా శరీరంలో హిమోగ్లోబిన్ 9 శాతానికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు. ఎక్కువగా రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో బాధపడ్డాను. వైద్యులను సంప్రదిస్తే మొదట దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు.. అని రష్మిక చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 18న సర్జరీ జరిగిందని వివరించింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. మరో మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి. అని తెలిపింది. రష్మికకు సర్జరీ అయిన విషయం తెలిసిన ఫ్యాన్స్.. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల హెచ్ సీయూ భూముల వివాదంపైనా రష్మీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హెచ్ సీయూ భూవివాదం మీద రష్మీ స్పందిస్తూ.. వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హెచ్సీయూ భూముల్ని ఆక్రమించొద్దని, అడవిని నరికివేయొద్దని, మూగ జీవాలకు ఇళ్లు లేకుండా చేయొద్దని.. వాటి గోడు వినమని ప్రభుత్వాన్ని రష్మీ గౌతమ్ కోరిన విషయం తెలిసిందే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #RashmiGautam #HealthUpdate #RashmiInHospital #AnchorRashmi #SpeedyRecovery
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.