Header Banner

ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోంది! పీక కోస్తున్నా జై తెలుగుదేశం అన్నాడు.. ఆయనే స్ఫూర్తి!

  Tue May 27, 2025 13:32        Politics

దేవునికడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోందని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు. కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. "కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి 7 స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలి. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించాం. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణం. జనసేన, భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది" అని చంద్రబాబు తెలిపారు. “పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు.. వాళ్ల పనే అయిపోయింది. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం.

 

ఇది కూడా చదవండి: ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది. వైకాపా విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు. వేటాడారు, వెంటాడారు.. అక్రమ కేసులు పెట్టారు. కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. మన పసుపు సింహం, కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది” అని చంద్రబాబు అన్నారు. "ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు, హక్కులకు రక్షణ కల్పించాం. పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా.. తెదేపా వర్సిటీలో చదివిన విద్యార్థులే. మన పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు.. చెరిపేస్తే చెరిగేది కాదు. పార్టీ విధానాలు, ఆలోచనలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయి" అని చంద్రబాబు అన్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

 

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations