Header Banner

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

  Tue Apr 22, 2025 10:23        Employment, Politics

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా, అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ, ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులున్నాయి. అయితే, ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు.. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి: వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తిచేయొచ్చు. ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోనుంది. శాఖల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాలు..

అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్: 100 (30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్)

బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్: 691 (141 క్యారీ ఫార్వర్డ్)

డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2 టెక్నికల్ అసిస్టెంట్: 13

తన్నేదార్: 10

WhatsApp Image 2025-04-22 at 10.17.33 AM.jpeg

వచ్చేనెలలో గ్రూపు-1 ప్రధాన పరీక్షలు రాయనున్న అభ్యర్థుల హాల్టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 7 పరీక్షలను ఎంపిక చేసిన 4 జిల్లాల్లో మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..

 

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations