Header Banner

ఏపీ ప్రజలకు శుభవార్త! చెన్నై- విజయవాడ వందే భారత్ ఆ జిల్లా వరకు పొడిగింపు!

  Mon May 05, 2025 12:08        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో రైల్వే పోషిస్తున్న పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి. ఏపీలో వందే భారత్ రైళ్లతో, కొత్త రైల్వే లైన్లతో ఏపీ రైల్వే వ్యవస్థను పరిపుష్ఠం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా హై ఫై వసతులతో వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే. ఇక తాజాగా ఏపీ వాసులకు వందే భారత్ విషయంలో మరో శుభవార్త చెప్పింది.



ఏపీకి మరో శుభవార్త చెప్పిన రైల్వే

ఇప్పటికే ఇప్పటికే విశాఖ వందే భారత్ కు సామర్ల కోటలో హాల్టింగ్ ఇచ్చింది. సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ కు ఏలూరులో హాల్టింగ్ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ఆ ప్రాంత వాసులకు వందే భారత్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో రూట్లో కూడా వందే భారత్ రైలును పొడిగించి శుభవార్త చెప్పింది.


ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

చెన్నై- విజయవాడ వందే భారత్ రైలు పొడిగింపుపై రకరకాల ఆలోచనలు

అదేవిధంగా విజయవాడలో ఈ రైలు కారణంగా కలుగుతున్న ఇబ్బందికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుందని భావిస్తున్న రైల్వే శాఖ ఆలోచన చేస్తుంది . ఈ వందే భారత్ రైలును మొదటి భీమవరం వరకు పొడిగించాలని భావించిన ఆ ఆలోచనను విరమించుకుంది. భీమవరంలో ఈ రైలును ఆపితే బోగిలలో నీళ్లు నింపడానికి అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని విరమించుకొని, మచిలీపట్నం వరకైనా పొడిగించాలని ఆలోచించింది.

 

కేంద్ర మంత్రి చొరవతో అక్కడివరకు వందేభారత్

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ, కేంద్రమంత్రి కావడంతో ఆయన నరసాపురం వరకు వందే భారత్ ను పొడిగిస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏలూరు మీదుగా వందే భారత్ నడుస్తుందని, నరసాపురం వైపు కూడా వందే భారత్ నడిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

 

వందే భారత్ రాక కన్ఫర్మ్ కావటంతో శరవేగంగా స్టేషన్లో పనులు

దీనిపైన రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడంతో నరసాపురానికి వందే భారత్ రైలు రావడం కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే వందే భారత్ రైలు నరసాపురం వరకు కొనసాగితే కావాల్సిన మౌలిక సదుపాయాల పైన దృష్టి పెట్టి నరసాపురం రైల్వే స్టేషన్లో పనులు చేస్తున్నారు . రైళ్లకు నీటిని నింపే పైప్లైన్ పనులు చేపట్టారు. దాదాపు 70 శాతం ఈ పనులు పూర్తయినట్టు గా తెలుస్తుంది. 

 

ఇకపై చెన్నై- విజయవాడ- నరసాపురం వందే భారత్

అలాగే ట్రాక్ ని పటిష్టంగా ఉంచడానికి కూడా పనులు చేస్తున్నారు. విజయవాడలో ఎన్ని ఎక్కువ గంటలు ఖాళీగా ఉంటున్న ఈ రైలును ఇప్పుడు వరకు పొడిగించి, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ విజయవాడకు వచ్చేలా ప్లాన్ చేయనున్నారు. ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వందే భారత్ రైలు చెన్నై - విజయవాడ- నరసాపురం, నరసాపురం- విజయవాడ- చెన్నై వరకు దూసుకుపోనుంది.


ఇది కూడా చదవండి: కేబినెట్ లోకి నాగబాబు, బీజేపీకి మరో బెర్తు? ఆ ముగ్గురూ ఔట్???

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #VandeBharat #VandeBharatAP #NarasapuramVandeBharat #IndianRailways #SouthCentralRailway #VijayawadaRailway