Header Banner

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి..

  Thu Apr 17, 2025 14:36        Politics

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 'యంగ్ గ్లోబల్ లీడర్' (YGL)-2025 గా ఎంపికైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రామ్మోహన్ నాయుడికి లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు పట్ల చంద్రబాబు స్పందిస్తూ, ఇది రామ్మోహన్ నాయుడి అంకితభావం, కృషి, దార్శనికతకు లభించిన సరైన గౌరవమని కొనియాడారు. "యువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఇప్పుడు ప్రపంచ వేదికపై 'యంగ్ గ్లోబల్ లీడర్'గా గుర్తింపు పొందడం తెలుగువారందరికీ గర్వకారణం" అని పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడి నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత యువతరానికి స్ఫూర్తిదాయకమని ఆయన ప్రశంసించారు. ఈ గుర్తింపుతో రామ్మోహన్ నాయుడు దేశానికి, రాష్ట్రానికి మరింత సేవ చేసేందుకు ఉత్తేజితుడవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడంలో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

 

అమరావతి పర్యటన.. ప్రధాని మోదీ షెడ్యూల్‌ ఖరారు.!

 

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

 

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!

 

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

 

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations