డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్! విద్యార్థులకూ గోల్డ్ కార్డ్ వీసాలు! ఆ ఒక్కటి చేస్తే చాలు!
Thu Feb 27, 2025 16:44 U S A
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రోజే సంపన్న వలసదారులకు శుభవార్త చెప్పారు. ముఖ్యంగా 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే చాలు గోల్డ్ కార్డ్ వీసాను పొందవచ్చని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే దీని గురించి మరోసారి మాట్లాడుతూ.. ఈ గోల్డ్ కార్డ్ కేవలం సంపన్న వలసదారుల కోసం మాత్రమే కాదని విద్యార్థులకు కూడా లభిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకోసం వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. బాగా చదువుకుంటే చాలంటూ వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రాగ్రామ్ వల్ల అనేక మోసాలు, అక్రమాలు జరగుతున్నట్లు గుర్తించిన యూఎస్ సర్కారు.. దీని స్థానంలో గోల్డ్ కార్డును అందజేయబోతున్నట్లు ప్రకటించింది. మంగళవారం రోజే ఇందుకు సంబంధిచిన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గోల్డ్ కార్డ్ పొందాలనుకునే వారు 5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 44 కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. దీని వల్ల అమెరికాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుందని.. తమకున్న అప్పును కూడా ఈ డబ్బులతోనే తీర్చేయొచ్చని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అందరూ ఈ గోర్డ్ కార్డ్ కేవలం సంపన్న వలసదారుల కోసం మాత్రమే కావొచ్చని భావించారు. ఇదే విషయాన్ని ఓ మీడియా ప్రతినిధి ట్రంప్ను అడగ్గా.. గోల్డ్ కార్డ్ వీసా ధనవంతుల కోసం మాత్రమే కాదని విద్యార్థులకు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే సంపన్న వలసదారుల మాదిరి వీళ్లు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని.. వీరికి బదులుగా డబ్బులను వారికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు కడతాయన్నారు.
నెంబర్ వన్ విద్యార్థులను తమ కంపెనీలకు తీసుకోవాలని అనేక కంపెనీలు ఫోన్లు చేసి మరీ తనను అడుగుతున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకునేందుకు యూస్ వస్తున్నారని వివరించారు. వారంతా హార్వర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి పేరున్న విద్యా సంస్థల్లో చేరి నంబర్ వన్ విద్యార్థులుగా మారతారన్నారు. వీరికి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయని.. అయితే ఆ వ్యక్తి ఈ దేశంలో ఉండేందుకు అర్హత కల్గి లేకుంటే ఆయా కంపెనీలే గోల్డ్ కార్డును కొనుగోలు చేయవచ్చన్నారు.
ఇలా చేస్తే విద్యార్థులు బాగా సంపాదించి, దేశానికి పెద్ద మొత్తంలో పన్నులు కూడా కడతారని ట్రంప్ వ్యాఖ్యానించారు. కంపెనీలు దీన్ని రిక్రూట్మెంట్గా కూడా ఉపయోగించుకోవచ్చని వివరించారు. రెండు వారాల్లో ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ గోర్డ్ కార్డుకు వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి:
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!
మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!
ఏపీ ప్రజలకు భారీ గుడ్న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.