Header Banner

ఏపీలోని ఆ జిల్లాల్లో బంగారం, వజ్రాల గనులు! టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం!

  Wed Apr 23, 2025 09:44        Politics

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ కీలక ప్రకటన చేసింది! బంగారం, వజ్రాలు, మాంగనీసు, సున్నపురాయి నిక్షేపాల వేట మొదలైంది. శ్రీసత్యసాయి, అనంతపురం, విజయనగరం, కడప జిల్లాల్లో అన్వేషణ కోసం టెండర్లు ఆహ్వానించారు. జూన్ 6 వరకు బిడ్లు స్వీకరిస్తారు. ఈ టెండర్లలో ఎవరు గెలుస్తారో, ఎక్కడెక్కడ నిక్షేపాలు బయటపడతాయో చూడాలి. రాష్ట్ర ఖనిజ సంపదకు ఇది శుభ సూచకమా.

 

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ బంగారం, వజ్రాల నిక్షేపాల అన్వేషణ కోసం గనులశాఖ టెండర్లు పలిచింది. అలాగే మాంగనీసు, సున్నపురాయి కూడా టెండర్లను ఆహ్వానించింది.. జూన్ 6 వరకు బిడ్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలో మేజర్‌ మినరల్స్‌ పరిధిలో ఉన్న మొత్తం ఏడు బ్లాక్‌లకు టెండర్లు నిర్వహించడానికి కేంద్ర గనుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ బంగారం, వజ్రాల నిక్షేపాలు రాష్ట్రంలోని శ్రీసత్యసాయి, అనంతపురం, విజయనగరం, కడప జిల్లాల్లో ఈ టెండర్లు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి ఉత్తర, దక్షిణ బ్లాకుల్లో బంగారం కోసం వెయ్యి హెక్టార్ల చొప్పున స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ బంగారం అన్వేషణ కోసం కాంపౌండింగ్‌ లైసెన్స్‌ మంజూరుకు బిడ్లు ఆహ్వానించారు. అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిలం దగ్గర వంద హెక్టార్లలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతారు.. దీనికి కూడా బిడ్లు పిలిచారు. కడపజిల్లాలోని మైలవరం, పెద్దముడియం మండలాల్లో సున్నపురాయి లీజుల కోసం బిడ్లు ఆహ్వానించారు. మైలవరంలోని మాధవపురంలో 697 హెక్టార్లు, పెద్దముడియంలోని భీమగుండంలో 698 హెక్టార్లలో సున్నపురాయి కోసం బిడ్లు పిలిచారు.

 

ఇది కూడా చదవండి: ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య.. కత్తులతో దాడి చేసిన దుండగులు!

 

విజయనగరం జిల్లాలో శివన్నదొరవలస, పెద్ద లింగవలసలో మాంగనీస్ కోసం టెండర్లు పిలిచింది గనులశాఖ. శివన్నదొరవలసలో 420 హెక్టార్లు, పెద్ద లింగవలసలో 472 హెక్టార్లలో మాంగనీస్ అన్వేషణ చేస్తారు. ఈ మేరకు టెండర్ దక్కించుకునేవాళ్లు ఆ విస్తీర్ణం పరిధిలో ఖనిజాన్వేషణ చేసి, నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి నివేదిక అందజేస్తే.. ఎంత మేరకు ఖనిజం ఉందో అంత విస్తీర్ణానికి లీజులు మంజూరు చేస్తారు.

 


ఆ బాధ్యత ఆర్టీసీకి అప్పగించిన ప్రభుత్వం
ఏపీలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాల రవాణా కాంట్రాక్టును ఏపీఎస్‌ఆర్టీసీకి అప్పగించారు. జిల్లా కేంద్రంలోని గోదాము నుంచి మండలాలకు తరలించే రవాణా బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించినట్లు పాఠ్యపుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్‌ మధుసూదన్‌రావు తెలిపారు. జీఎస్టీ, ఇతర అన్ని ఖర్చులతో కలిపి రవాణా చేసేందుకు ఒక్కో పాఠ్యపుస్తకానికి రూ.1.44 చొప్పున చెల్లించనున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం 87.56 ఎకరాల ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన ముఖ్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #APGoldMines #APDiamondHunt #MineralExplorationAP #APMiningTender #NaturalWealthOfAP #AndhraMinerals #GoldInAP