Header Banner

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

  Wed May 21, 2025 07:32        Politics

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరుకులు అందించే బాధ్యతను మళ్లీ చౌక ధరల దుకాణాల డీలర్లకే ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం కోరింది. అంతేకాకుండా, డీలర్ల ఆదాయం పెంచేందుకు రేషన్ షాపుల్లోనే విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలనే జీవో 5ను అమలు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం రేషన్ డీలర్లకు అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి వ్యతిరేకంగా ఎండీయూ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 29,500 మంది రేషన్ డీలర్లు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్లు ఆత్మగౌరవంతో జీవిస్తూ కుటుంబాలను పోషించుకునేవారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఇచ్చేవారని ఆయన అన్నారు. దీనివల్ల ఐదేళ్లలో రూ. 80 కోట్ల మేర రేషన్ డీలర్లు లబ్ధి పొందారని ఆయన వివరించారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే రేషన్ పంపిణీ అంశంపై ఇవాళ కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇకపై రేషన్ పంపిణీని వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపులకు వెళ్లి తీసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వాహనాలను ఆపేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపులలో డీలర్ల ద్వారా ప్రజలు బియ్యం తీసుకునేలా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రేషన్ వాహనాల అంశంపై పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్రంలో రేషన్‌ సరకులు పంపిణీ చేస్తున్న మొబైల్‌ రేషన్‌ డెలివరీ (ఎండీయూ) వాహనాలు కొనసాగించాలా.. నిలిపివేయాలా అన్న అంశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. రేషన్ పంపిణీ చేసేందుకు ఎండీయూ వాహనం వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండి సరకులు తీసుకోవడం కుదరడం లేదని.. మరోసారి వాహనం రాకపోవడంతో సరకులు కోల్పోతున్నట్లు కొందరు మహిళలు మంత్రితో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. అయితే ప్రభుత్వం మాత్రం రేషన్ వాహనాలను రద్దు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇవాళ క్లారిటీ వస్తుందంటున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APRationCard #GoodNews #RuleChange #WelfareUpdate #AndhraPradesh #RationCardBenefits