Header Banner

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్! టెన్త్‌ పాసైనా చాలు.. 40,000 జీతంతో 1302 ఉద్యోగాలు!

  Tue Apr 29, 2025 08:58        Employment

నిడదవోలు నియోజకవర్గ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం (ఏప్రిల్‌ 28) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 3వ తేదీన ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఈ మెగా జాబ్‌ మేళ జరగనుందని తెలిపారు. జాబ్ మేళాలో భాగంగా 1302 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. తద్వారా రూ.12 000 నుంచి రూ.40,000 వరకు జీతం పొందవచ్చన్నారు.
జాబ్ మేళాకు ఇసూజూ, ఎల్ అండ్ టీ కన్ స్ట్రక్షన్, జీఎంఆర్ కార్గో, పానాసోనిక్,హెచ్ డీబీ ఫినాన్షియల్ సర్వీసెస్, అపోలో ఫార్మసీ, ఐసోన్ ఎక్స్ పీరియన్సెస్, స్మార్ట్ బ్రెయిన్స్, సాండ్ స్పేస్ టెక్నాలజీస్, డీలేట్ కర్ కార్పొరేట్, సదర్ ల్యాండ్, సినర్జీన్, ఈఎస్ఏఎఫ్, స్పందన, ముత్తూట్ ఫైనాన్స్, పైసా బజార్, రీసొల్యూట్, ఇండస్, ఎంసీవీ, ఇండో ఎంఐఎం, పిల్కింగ్టన్, ఇన్ ఫిలూమ్, హెచ్ డీఎఫ్ సీ, బీఎస్ సీపీఎల్, జీఎల్ఆర్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ తదితర 45 కంపెనీల ప్రతినిధులు రానున్నారని తెలిపారు.
పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ పాసై మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని 35 ఏళ్లలోపు ఆసక్తిగల నిరుద్యోగ యువతీయువకులు తమ బయోడెటా, విద్యార్హత, సర్టిఫికెట్లతో మే3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే జాబ్ మేళాకు హాజరుకావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.


ఇది కూడా చదవండి: పెన్షనర్లకు గుడ్‌న్యూస్..! భారీగా పెరుగుతున్న పెన్షన్‌.. ఎంత అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #JobFair #YouthEmployment #MegaJobMela #NidudavoluJobs #CareerOpportunity #JobsForAll