Header Banner

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

  Thu Apr 17, 2025 09:30        Politics

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పాలన సమయంలో లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతలు విచారణకు ఆదేశించారు. దాదాపు పది నెలల కాలంగా విచారణ సాగుతోంది. ఇప్పుడు వైసీపీ ముఖ్యుల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మాజీ ఎంపీ సాయిరెడ్డి ఈ కేసులో విచారణకు హాజరు కానున్నారు. కాగా, ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు కసిరెడ్డి కోసం మరో సారి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. హైదరాబాద్ లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. కీలక ఆధారాలు లభ్యం అయ్యాయ ని చెబుతున్న వేళ.. సాయిరెడ్డి - మిథున్ విచారణ ఉత్కంఠ పెంచుతోంది.

 

మిథున్ రెడ్డికి నోటీసులు

మద్యం స్కామ్‌లో సిట్‌ స్పీడు పెంచింది. ఇప్పటికే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డిని ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, సాయిరెడ్డి ఈ రోజు (గురువారం) విచారణకు హాజరు కానున్నారు. ఇదే సమయంలో మూడు సార్లు నోటీసులు జారీ చేసినా కసిరెడ్డి స్పందించ లేదు. దీంతో, ఆయన తండ్రికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక.. కసిరెడ్డి ని ఈ నెల 19న విచారణ కు హాజరవ్వాలంటూ సిట్ మరో సారి తాఖీదులు జారీ చేసింది. కాగా, ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రేపు (శుక్రవారం) సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు సమాచారం.


ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టుల జాబితా విడుదల! కీలక కమిటీలకు కొత్త చైర్మన్ ! లిస్ట్ ఇదే!

 

వారితో కలిపి విచారణ

ఇదే సమయానికి మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వీరిని మిథున్‌ రెడ్డితో కలిపి ప్రశ్నించి... కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే...మిథున్ విచారణకు హాజరవుతారా, లేదా అనే అంశంపై ఉత్కంఠ నెల కొంది. ఆయనకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ... విచారణకు సహకరించా లని స్పష్టం చేసింది. మరో వైపు రాజ్‌ కసిరెడ్డికి 'సిట్‌' మరో నోటీసు జారీ చేసింది. ఒకవైపు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తూనే... తాజాగా ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీసు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు సిట్‌ విచారణకు డుమ్మా కొట్టిన రాజ్‌ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో సిట్‌ సిబ్బంది సోదాలు జరిపారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్న రాజ్‌ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డిని కూడా ప్రశ్నించారు. మద్యం స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల విచారణ వేళ అవరమైన సమాచారం రాబట్టే ప్రయత్నాలు సిట్ చేస్తోంది.

సాయిరెడ్డి గుట్టు రట్టు

ఈ సమయంలో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఈ రోజు సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ మొత్తం కసిరెడ్డి అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మద్యం కేసులో విచారణకు వస్తే తనకు తెలిసిన సమాచారం ఇస్తానని గతంలోనే సాయిరెడ్డి స్పష్టం చేసారు. ఇప్పుడు సాయిరెడ్డి వైసీపీకి దూరమయ్యారు. బీజేపీ కి దగ్గర అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో సాయిరెడ్డి సిట్ ముందుకు వస్తే ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. కసిరెడ్డి విచారణకు రాకపోతే.. సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. కసిరెడ్డి పాత్ర ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో, ఈ రెండు రోజుల్లో మద్యం కేసులో చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి జగన్ కి మరో దిమ్మతిరిగే షాక్.. హైదరాబాద్ లో వైసీపీ నేత కృష్ణవేణి అరెస్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో రెండు నామినేటెడ్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! వారిద్దరినీ వరించిన కీలక పదవులు!

 

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #APPolitics #LiquorScam #YSRCP #VijayaSaiReddy #MithunReddy #RajKasireddy #SITInvestigation