Header Banner

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెయిన్స్ షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచి అంటే..!

  Tue Mar 18, 2025 09:57        Others

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిమిలినరీ పరీక్షల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ఏడాది మే 25న ఈ పరీక్ష నిర్వహించగా ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఇప్పటికే జారీ చేసింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా వారిలో 18,037 అంటే 82.02 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్‌ పరీక్షల హాల్‌టికెట్లను మార్చి 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.


ఇది కూడా చదవండివైసీపీకి మరో భారీ షాక్! కీలక నేత అరెస్ట్.. అసలు ఏమైందంటే..?


ఇక మెయిన్స్‌ రాత పరీక్షలు మార్చి 26, 27 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. మెయిన్‌ పరీక్షలు మొత్తం 3 పేపర్లకు జరగనున్నాయి. ఈ మూడు పేపర్లు మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటాయి. పేపర్‌ 1 పరీక్ష మార్చి 26 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 పరీక్ష మార్చి 27న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్‌ 3 పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్! ఆధార్ ఫింగర్ సమస్యకు పరిష్కారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!


తిరుమలలో భక్తుల వసతి కష్టాలకు చెక్! శిథిల భవనాల తొలగింపు.. టీటీడీ కార్యాచరణతో కీలక మార్పులు!


మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!

 

నేటితో గొడ్డలి వేటుకు ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!

 

 రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!

 

 గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #appsc #deo #post #notification #todaynews #flashnews #latestnews