భవిష్యత్లోనూ ఇదే పంథా కొనసాగిద్దాం! త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ రాష్ట్రంలో.. కూటమి ఎంపీలతో మంత్రి!
Wed Feb 05, 2025 11:53 Politicsఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నిన్న రాత్రి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి లోకేశ్ పలు కీలక వినతులు చేశారు. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని లోకేశ్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విశాఖపట్నంలో తాము ఏర్పాటు చేయబోతున్న డేటా సిటీకి సహకరించాలని కోరారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
ఇంకా చదవండి: ఏపీలో రూ.96 వేల కోట్లతో భారీ పరిశ్రమ! కేంద్రం కీలక ప్రకటన!
ప్రత్యేక ఆర్ధిక మండళ్లు, డేటా సిటీల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అన్ని రకాలుగా సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇచ్చిన పలు సూచనలను సీఎం దృష్టికి తీసుకువెళతామని లోకేశ్ తెలిపారు. త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ విశాఖ, తిరుపతిలలో పర్యటించి గతంలో టీడీపీ హయాంలో చేసిన పనులు స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని, కాగ్నిజెంట్ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వస్తుందని తెలిపారు. ఏడాదిలో రాష్ట్రంలో ఒక్కో ప్రాజెక్టును ఏర్పాటు చేసుకుంటూ వెళ్తామని లోకేశ్ వివరించారు.
ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల ఛైర్మన్లు నియామకం! కీలక నోటిఫికేషన్ జారీ!
ఓరీ దేవుడా.. ఒకే అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో.. రోడ్డుపై విద్యార్థినుల ఫైట్!
ప్రియురాలి కోసం చైన్ స్నాచర్గా మారిన మాజీ MLA కొడుకు.. ఎంతకి తెగించాడురా.. అందరూ షాక్!
సుమ బండారం బయటపెట్టిన యూట్యూబర్.. గంట షూటింగ్కొస్తే.. సోషల్ మీడియాలో వైరల్!
త్వరలోనే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్!
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై కీలక అప్డేట్! బ్యాంకర్లతో సీఎం కీలక భేటీ!
వైసీపీకి షాక్ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!
ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!
తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!
సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!
ఫామ్ హౌస్లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్ మామూలుగా లేదుగా!
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #NaraLokesh #AshwiniVaishnav #AndhraPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.