ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ అత్యవసర భేటీ! పహల్గాం ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి!
Wed Apr 23, 2025 09:58 Politics
జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir), అనంతనాగ్ జిల్లాలోని పహెల్గామ్ 9Pahalgam)లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి (Terror Attack)లో విశాఖ వాసి (Visakhapatnam Man) చంద్రమౌళి (Chandramouli) (రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి) మృతి చెందారు. హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి హూటాహూటిన జెడ్డా నుంచి భారత్కు తిరుగుపయనమయ్యారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోదీ... ఎయిర్పోర్టులోనే అత్యవసర భేటీ నిర్వహించారు.
ఇది కూడా చదవండి: కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్! కారణం ఏంటో తెలుసా?
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో సమావేశమై ఉగ్ర ఘటనపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి దాడి జరిగిన తీరును వివరించారు. కాగా, ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇక, ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా... భద్రతా ఉన్నతాధికారులతో భేటీ అయి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. ఇవాళ ఆయన దాడి జరిగిన పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు. కశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై ఉగ్రమూకలు పాశవిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా... మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య.. కత్తులతో దాడి చేసిన దుండగులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నాలుగు గోడల వెనుక కాదు… జగన్ బయటకు వచ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..
సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్మెంట్! సోషల్ మీడియాలో వైరల్!
వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!
చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?
మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..
చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!
ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!
ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #PMModi #EmergencyMeeting #DelhiAirport #PahalgamTerrorAttack #Visakhapatnam #TerrorAttack
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.