Header Banner

విమానం కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి! వారి కుటుంబాలకు అండగా..

  Thu Jun 12, 2025 22:20        Politics

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులు, కళ్లారా చూసిన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉండి సహాయక, పునరావాస కార్యక్రమాలను తాను నిశితంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. "అహ్మదాబాద్‌లోని ప్రమాద స్థలాన్ని ఇప్పుడే సందర్శించాను. అక్కడ నేను చూసినవి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. నేను ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నాను" అని మంత్రి తన పోస్టులో పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎయిర్ ఇండియా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలతో పాటు స్థానిక పరిపాలనా యంత్రాంగం అహోరాత్రులు శ్రమిస్తున్నాయని మంత్రి వివరించారు. ఈ విషాద సమయంలో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా నిలవడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. "ఈ కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలవడానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rammohan Naidu #Inspects #Ahmedabad #PlaneCrash #Flight #apMinister