ఏపీ ప్రజలకు తీపి కబురు! రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ప్రయోజనం! మీ పేరు నమోదు చేసుకోండి!
Wed Apr 23, 2025 19:22 Politics.202504237582.jpg)
రైతులకు గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. వెంటనే మీరు మీ పేరును నమోదు చేసుకోండి. ఏకంగా రూ. 2 లక్షల నుంచి రూ 4 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ బెనిఫిట్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.
చంద్రబాబు ప్రభుత్వం సూక్ష్మ సాగు నీటి పథకం కింద అర్హత కలిగిన రైతులకు సబ్సిడీ రూపంలో తుంపర సేద్యం పరికరాలను అందించనుంది. అందువల్ల రైతులు కూడా ఈ ప్రయోజనం పొందొచ్చు.కడప జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15 వేల హెక్టార్లలో రాయితీ కింద ఈ పరికరాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 14 వేల మందికి పైగా అన్నదాతలకు రాయితీ కింద తుంపర సేద్యం పరికరాలను అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! దాడి కేసులో కీలక మలుపు! మళ్ళీ విచారణలో...
ఏపీఎంఐపీ జిల్లా అధికారి వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. రైతులు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల వద్దకు బిందు సేద్యం పరికరాల కోసం అప్లై చేసుకోవచ్చని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ కింద ప్రయోజనం లభిస్తుందని వివరించారు.ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదు ఎకరాల లోపు పొలం ఉంటే.. వారికి వంద శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు లభిస్తాయి. ఒక్కో రైతుకు రూ.2 లక్షలకు పైగా ప్రయోజనం లభించినట్లు అవుతుంది. అదే 5 నుంచి పది ఎకరాల లోపు పొలం ఉంటే.. వాళ్లకు 90 శాతం రాయితీ వస్తుంది. రూ. 3.5 లక్షల విలువైన పరికరాలు పొందొచ్చు.
ఇక పది ఎకరాలకు పైన పొలం ఉంటే... అప్పుడు 50 శాతం రాయితీ వస్తుంది. వీళ్లకు రూ.లక్షల వరకు బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల రైతులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. దగ్గరిలోని ఆర్బీకే సెంటర్లకు వెళ్లి.. అప్లై చేసుకోండి.ప్రభుత్వం వచ్చే పది రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వారి పొలాల వద్దకు వెళ్లి సర్వే చేస్తుంది. అటు పైన అర్హత కలిగిన రైతులకు డ్రిప్ పరికరాల మంజూరు జరుగుతుంది. అధికారులు పొలం వద్దకు వెళ్లి మీకు డ్రిప్ పరికరాలు అమర్చి వెళ్తారు.కాగా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ అనేది నీటిని తక్కువగా వినియోగిస్తూ, నేరుగా మొక్కల రూట్ ప్రాంతానికి అందించే సాంకేతిక పద్ధతి. ఇది ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పద్ధతిలో నీటి వృథా తక్కువగా ఉండడం వల్ల నీటి వినియోగం 30–50% తగ్గుతుంది.నేల తడిగా ఉండటంతో పంటల పెరుగుదల మెరుగవుతుంది. ఎరువులు కూడా నీటితో కలిపి నేరుగా మొక్కలకు అందించవచ్చు. మలిన జలాల వాడకానికి కూడా అనుకూలం. డ్రిప్ ద్వారా ఎక్కువ దిగుబడి, తక్కువ పెట్టుబడితో ఆదాయం సాధ్యమవుతుంది. దీన్ని అనుసరించడం రైతులకే కాదు, పర్యావరణానికి కూడా మేలు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!
ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!
ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!
నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!
వారికి గుడ్న్యూస్ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..
ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!
తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..
పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?
లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!
అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!
మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Andhrapradesh #DripFarming #SustainableAgriculture #FarmerProfit #WaterConservation #EcoFriendlyFarming #ReuseWastewater #LowInvestment
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.