Header Banner

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

  Fri Apr 25, 2025 11:43        Politics

గుడివాడలో వైసీపీ మూకలు మరోసారి బరితెగించారు. జగన్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అండ చూసుకుని దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడులు చేశారు. దాడులు చేయడమే గాకుండా కేసులు పెట్టి మరీ వేధించారు. ఎంతోమంది నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వారి ఆగడాలకు తట్టుకోలేక పోయారు. దాడులు చేయడమే గాకుండా వైసీపీ మూకలు ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాయి.

కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతుండటంతో టీడీపీ నేతలు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్ హయాంలో ఏపీని రణరంగంగా మార్చడంతో చూసి తట్టుకోలేకపోయిన సామాన్య ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. జగన్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించివేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి సరైన గుణపాఠం చెప్పారు. అయినా కూడా వైసీపీ నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. సరికదా ఆపార్టీ హై కమాండ్ దిగువ స్థాయి కేడర్‌ను వారించినా సందర్భాలు కూడాలేకపోవడంతో విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా గుడివాడలో టీడీపీ నేతలకు సంబంధించిన కార్యాలయంలో దాడి చేయడం సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!


గుడివాడ మార్కెట్ యార్డు వద్ద తెలుగుదేశం నేతకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంపై నిన్న (గురువారం) అర్ధరాత్రి మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ కార్యాలయంలోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వైసీపీ నేత లింగం చిట్టిబాబు మరో 15 మంది దాడిలో పాల్గొన్నట్లు ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులు గుర్తించారు. అర్ధరాత్రి కార్యాలయం పరిసరాల్లో విధ్వంసం సృష్టించారు. కార్యాలయంలో మూడు లక్షల నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ తెలిపారు.

దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకోబోయిన స్థానికులను చంపుతామంటూ బెదిరించారని అడుసుమిల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆ కారణంగానే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని అడుసుమిల్లి శ్రీనివాస్ కోరారు. పోలీసులకు ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. దాడి చేసిన వారిని గుర్తించడానికి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలియడంతో గుడివాడలోని టీడీపీ నేతలు నిరసనకు దిగారు.


ఇది కూడా చదవండి: టెన్షన్... టెన్షన్! వైసీపీ నేతల్లో వణుకు! కీలక నిందితుడికి రిమాండ్!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

 

వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!

 

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YCPViolence #GudivadaAttack #TDPvsYCP #PoliticalViolence #AndhraPolitics #LawAndOrder #YCPGoons