సీనియర్లను గౌరవిస్తా!! యువతను ప్రోత్సహిస్తా!! పని చేసేవాళ్లను గుర్తిస్తా- నారా లోకేష్

Header Banner

సీనియర్లను గౌరవిస్తా!! యువతను ప్రోత్సహిస్తా!! పని చేసేవాళ్లను గుర్తిస్తా- నారా లోకేష్

  Sat Feb 17, 2024 05:28        Politics

విజయనగరం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగం
• ఉత్తరాంధ్ర అమ్మలాంటిది..అమ్మ ప్రేమకు కండీషన్స్ ఉండవు..ఇక్కడి ప్రజల ప్రేమకూ కండీషన్స్ ఉండవు.
• ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. ఉత్తరాంధ్ర ప్రజల స్పీడు కూడా వేరు. మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు..తప్పు చేస్తే పాతేస్తారు.
• విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తొస్తుంది. విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతత గుర్తొస్తుంది.
• పైడితల్లి అమ్మవారు ఉన్న పుణ్యభూమి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఈ విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన భూమిలో శంఖారావం చేపట్టి మీ ముందు నిలబడటం నా అదృష్టం.          • సైకో జగన్ నిన్న ఒకసభలో మాట్లాడుతూ...చొక్కా చేతులు మడతపెట్టాలని వారి కార్యకర్తలకు చెబుతున్నాడు. ఇటు పసుపు సైన్యం, అటు జనసైనికలు కలిసి నీ కుర్చీ మడతపెట్టే రోజులు రాబోతున్నాయి.

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

• నీ బ్యాచ్ కు బూమ్ బూమ్, ఆంధ్రాగోల్డ్ కావాలి..కానీ మా కార్యకర్తలకు పసుపు జెండా చూస్తేనే ఎక్కడాలేని ఉత్సాహం వస్తుంది.

• మా జోలికి రావొద్దు మై డియర్ జగన్. రెండు నెలల్లో నీ కుర్చీ మడతపెట్టే బాధ్యత మేము తీసుకుంటాం.
• జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి. నేను ఆ తాడేపల్లి వైపు ఎప్పుడు వెళ్లినా మ్యావ్ మ్యావ్ అని వినబడుతుంది.
• అమరావతి రైతులకు అండగా నిలబడేందుకు ఒక సినీనిర్మాత రాజధాని ఫైల్స్ సినిమా తీస్తే విడుదలవ్వకుండా సైకో సిఎం విశ్వ ప్రయత్నాలు చేశాడు. ప్రజల్ని చూసినా... రైతులను చూసినా ఈ ముఖ్యమంత్రి భయపడతాడు.
• రాజధాని విషయంలో ఎన్ని యూటర్న్ లు తీసుకున్నాడు.? వాషింగ్టన్ కు ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. కనీసం 30 వేల ఎకరాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని సైకో జగన్ నాడు అసెంబ్లీలో చెప్పాడు.
• మనది 13 జిల్లాల చిన్నరాష్ట్రం...ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టంలేక మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పాడు. రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నాని చెప్పాడు.

• అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ ఆట లాడుతున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఆలోచించాలి..ఈ ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశాడా...ఒక్క పరిశ్రమైనా తెచ్చాడా..ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా.?
• ఇప్పుడు జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి మళ్లీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలంటున్నారు.
• బిల్డప్ కోసం యాత్ర సినిమా తీస్తే అది వైసీపీకి అంతిమ యాత్ర అయింది. రాజధాని ఫైల్స్ సినిమాను అందరూ చూడాలి.
• సొంత భూమి అందరి కల. 3 పంటలు పండే భూమి చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసి 35 వేల ఎకరాలు ఇచ్చారు. నాడు జగన్, పవన్, మోడీ కూడా అమరావతికి సంపూర్ణంగా మద్ధతిస్తున్నామని చెప్పాకే భూములిచ్చారు. కానీ జగన్ నేడు రైతుల త్యాగాలను అవమానిస్తున్నాడు.
• సైకో జగన్ ఒక మాట వాస్తవంగా చెప్పాడు. ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు లేరట..జనమే స్టార్ క్యాంపెయినర్లంట.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

• ఛాలెంజ్ చేస్తున్నా...ప్లేస్, టైం చెప్పండి. మీరు తీసుకొచ్చిన బూమ్ బూమ్ దుకాణాల వద్దకు వెళ్దాం..నీ పాలన ఎలా ఉందో మందుబాబులను అడుగుదాం..నువ్వు సిద్ధమా?
• మద్యం దుకాణాల వద్దకు వెళ్తే మందుబాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడతారో అర్థంమవుతుంది.
• తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలి..సంపూర్ణ మద్య నిసేధం చేశాక ఓట్లు అడుగతానన్నాడు చేశాడా.. ఊరూరా, ఇంటింటికి బెల్టు షాపుల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నాడు. టార్గెట్ ఇచ్చి మద్యం అమ్మిస్తున్నాడు.
• రెండో ఛాలెంజ్ చేస్తున్నా...మీరు ఎంచుకున్న ఇంటికే వెళ్దాం. 4 ఏళ్ల పది నెలల పాలనలో మీరు పెంచిన నిత్యావసర సరకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, వేసిన పన్నుల గురించి అడుగుదాం. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డలు మీకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
• డీఎస్సీ అభ్యర్థులు నన్ను కలిశారు. ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదు. నోటిఫికేషన్లు లేవు. ఈ సీఎం ఎప్పుడు దొరుకుతాడా అని యువత చూస్తున్నారు.
• పరదాలు కట్టుకోవడమే కాదు.. ఎక్కడికి వెళ్లినా రోడ్లపక్కన చెట్లను నరికేస్తున్నారు. జగన్ ను ప్రజలు తరిమేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

• జగన్ ఒక అవినీతి స్టార్. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనక కుంభకోణం ఉంటుంది. సెంటు స్థలాల పేరుతో రూ.7 వేల కోట్లు దొబ్బేశారు. చదును పేరుతో రూ.2 వేల కోట్లు నొక్కేశారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చాక తిన్నదంతా కక్కిస్తాం.
• జగన్ కు భయం పట్టుకుంది కలలో కూడా చంద్రబాబు కనబడుతున్నారు. అందుకే అర్థరాత్రి పోలీసులను పంపి చంద్రబుబను అరెస్ట్ చేయించారు.
• స్కిల్ డెవలెప్మెంట్ కేసులో మొదట రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారు. తర్వాత రూ.3 వందల కోట్లు, ఇప్పుడు రూ. 27 కోట్ల అవినీతి అంటున్నారు.
• చంద్రబాబును అరెస్టు చేసి అవినీతి మరక అంటించాలని చూశారు. చంద్రబాబును 53 రోజులు జైల్లో పెడితే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చాయి. ఆయనవల్ల తెలుగుజాతికి జరిగిన మేలు గుర్తుకు వచ్చింది.
• చంద్రబాబుది పోలవరం రేంజ్...జగన్ ది పిల్లకాలువ రేంజ్. చంద్రబాబును చూస్తే కియా గుర్తొస్తే...జగన్ ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది.
• చంద్రబాబును చూస్తే పరిశ్రమలు గుర్తొస్తాయి...జగన్ చూస్తే బూమ్ బూమ్, ఆంధ్రాగోల్డ్ గుర్తొస్తాయి.
• చంద్రబాబు అంటే బ్రాండ్..జగన్ అంటే జైలు. చంద్రబాబు ముందు చూపున్న విజనరీ..జగన్ ది ప్రిజనరీ.
• జగన్ కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టారు. ఆయన వద్ద రెండు బటన్లు ఉంటాయి... బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు..అదే క్షణం ఎర్రబటన్ నొక్కి రూ.100 లాగేస్తాడు.
• విద్యుత్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచాడు. ఆఖరికి పీల్చే గాలికి కూడా పన్ను వేస్తాడు ఈ సైకో.
• అన్న క్యాంటీన్, 6 లక్షల పెన్షన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు కట్ చేశారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారు.

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

• ప్రజలు పడుతున్న కష్టాలు మేం నేరుగా చూశాం. అందుకే చంద్రబాబు, పవన్ కలిసి సూపర్-6 ప్రకటించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు రావడం ఆలస్యమైతే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. యేటా డీఎస్సీతో పాటు, జాబ్ క్యాలండర్ విడుదల చేస్తాం. ఒక పద్దతి ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
• చదువుకునే ప్రతి విద్యార్థికి యేటా రూ.15 వేలు ఇవ్వబోతున్నాం. 18-59 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.15 వందలు ఇస్తాం.
• యేడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించబోతున్నాం.
• అన్నదాత కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద యేటా రూ.20 వేలు అందిస్తాం.
• ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానుల పేరుతో 3 ముక్కాలాట ఆడుతున్నాడు.
• ఉత్తరాంధ్రను మూడు కుటుంబాలకు జగన్ అప్పగించాడు. బొత్స సత్యానారయణ, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఉత్తరాంద్రపై పడి పందికొక్కుల్లా మేస్తున్నారు.
• జగన్ కేసుల్లో నిందితుడు విజయసాయిరెడ్డి. అన్ని కేసుల్లో ఏ2...ఇతను అశోక్ గజపతిరాజును అవమానించాడు. మాన్సాస్ ట్రస్టు ద్వారా అనేక సేవలందించారు. దేశంలోనే అద్భుతమైన సేవలందిస్తున్న స్వచ్చంద సంస్థ మాన్సాస్ ట్రస్టు.
• దాన్ని బలవంతంగా లాక్కునేందుకు పిల్లిగడ్డం విజయసాయిరెడ్డి ప్రయత్నించాడు. ఈ వేదిక నుండి విజయసాయిరెడ్డికి చెబుతున్నా...మీరు చేసిన దానికి రెట్టింపు చేసి ఎందుకు అశోక్ జగపతిరాజుతో పెట్టుకున్నానా అని భయపడేలా చేస్తా.
• ఈ జిల్లాకు జగన్ 50 హామీలు ఇచ్చాడు. భోగాపురం విమానాశ్రయం, రామతీర్థం ప్రాజెక్టు, గోస్తాని-చంపావతి నదుల అనుసంధానం పూర్తి చేస్తానని చేయలేదు.
• రామభద్రాపురం - పెద్దగడ్డ ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు..పాలేరు నదిపై డ్యాం, స్వర్ణముఖి-చిత్తగడ్డపై బ్రిడ్జి నిర్మాణం చేస్తానని చేయలేదు.
• ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తెస్తానని చెప్పి మాటతప్పాడు. పైగా ఉన్నపరిశ్రమలు కూడా పోయాయి.
• విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది టీడీపీనే. రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు, పట్టణ పేదలకు టిడ్కో ఇళ్లు నిర్మించాం.
• నిరుపేద కుటుంబాలకు మాన్సాస్ ట్రస్టు అండగా నిలబడింది. మీసాల గీత, అశోక్ గజనపతి రాజు గారు విజయనగరాన్ని అభివృద్ధి చేశారు.

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!     

• తాగునీటి సమస్యను పరిష్కరిచేందుకు గోస్తాని-చంపావతి నదుల నుండి నీళ్లు తీసుకొచ్చాం. డబుల్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు నిర్మించాం.
• 30 పడకల మహారాజా ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మార్చాం. ఇండోర్ స్టేడియం కట్టాం.
• కానీ మీరేం చేశారు..తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా విజయనగరాన్ని మార్చారు. అవినీతిరాజు ఎవరు అంటే కోలగట్లను చూపిస్తారు.
• ప్రభుత్వ భూములు లాక్కుని పార్టీ కార్యాలయం కట్టుకున్నారు. సెంటు పట్టాలంటూ రూ.15 లక్షలకు ఎకరా కొని రూ.38 లక్షలకు ప్రభుత్వానికి అమ్మారు. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, తిన్నదంతా కక్కిస్తాం.
• కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించాడు ఈ కోలగట్ల వీరభద్రస్వామి. అశోక్ గజపతిరాజుపై 3 కేసులు పెట్టించారు. ఆయన ఎప్పుడూ ఒకరిని కించపరిచి మాట్లాడే వ్యక్తి కాదు.
• ఇక్కడి ఎమ్మెల్యే కోలగట్ల, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి విజయనగరాన్ని గంజాయికి అడ్డాగా మార్చారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలి...కుటుంబాలను గంజాయి నాశనం చేస్తుంది.
• గంజాయి వల్ల లక్షల కుటుంబాలు నాశనం అయ్యాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక గంజాయికి పుల్ స్టాప్ పెడతాం.
• గతంలో టీడీపీ ఎమ్మెల్యే... ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే ఎలా పని చేస్తున్నారో మీరు చూస్తున్నారు.
• మన ప్రభుత్వం వచ్చాక పోలవరం పూర్తి చేస్తాం..గోదావరి నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పిప్తాం.
• ఈ ప్రాంతంలో క్యాన్సర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా క్యాన్సర్ ఆసుపత్రిని తీసుకొస్తాం.
• టీడీపీ బలం కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్లినా టీడీపీకి కార్యకర్తలు అండగా ఉన్నారు. దేశంలోనే కార్యకర్తల పార్టీ ఏదంటే అది టీడీపీనే.
• ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో కానీ పసుపు జండా చూస్తే నూతన ఉత్సాహం వస్తుంది.
• 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోతే రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించాం.
• ఇప్పటిదాకా రూ.100 కోట్లు కార్యకర్తలక ఖర్చుచేసి ఆదకున్నాం. చనిపోయిన వారి పిల్లను దత్తత తీసుకుని నాతల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు.
• నాకు అన్నాచెల్లి లేరు..అక్కా తమ్ముడు లేరు..కానీ 60 లక్షల కార్యకర్తలమంది కుటుంబ సభ్యులను ఎన్టీఆర్ ఇచ్చారు.
• ఏ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారో, ఏ వైసీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారందరి పేర్లు ఎర్రబుక్ ఉన్నాయి.
• వడ్డీతో సహా చెల్లిస్తాం. ఎర్రబుక్ చూస్తే సైకోలకు ఉచ్చపడుతున్నాయి. నన్ను అరెస్టు చేయాలని కోర్టుకు వెళ్లారు. ఎందుకు భయపడుతున్నారు?
• విజయనగరం నుండి చెబుతున్నా..నేను ఏనాడూ తప్పు చేయలేదు. నిజాయితీగా ఉండాలని మా తాత, మా నాన్నను చూసి నేర్చుకున్నా.
నేను నీలా పరదాలు కట్టుకొని తిరగలేదు, దమ్ముగా ప్రజలమధ్య 3132 కి.మీ. లు ప్రజలమధ్య తిరిగా.
• ఎన్టీఆర్ దేవుడు..చంద్రబాబు రాముడు..లోకేష్ వైసీపీ కార్యకర్తలకు మూర్ఖుడు. నేను ఎవర్నీ వదలిపెట్టను. పనికిమాలిన కేసులకు నేను భయపడను. భయం మా బయోడేటాలోనే లేదు.
• చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవనన్న. నువ్వు ధైర్యంగా ఉండు, అండగా ఉంటానని చెప్పారు.
• రాష్ట్రానికి రావడానికి పవన్ విమానం బుక్ చేసుకుంటే రాకుండా అడ్డుకునేందుకు దాన్ని రద్దు చేశారు. రోడ్డు మార్గాన రాకుండా సరిహద్దుల్లో అడ్డుకున్నారు.
• టీడీపీ, జనసేన కార్యకర్తలకు పిలుపునిస్తున్నా..పేటియం కుక్కలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. అందరం కలిసి సైకోను తరిమికొడదాం.
• ఈ శంఖారావం సభ ద్వారా పిలుపునిస్తున్నా..ప్రజల్లోకి వెళ్లాలి. సూపర్-6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలి.
• కష్టపడి పని చేసిన వారిని గుర్తుంచుకునే బాద్యత నేను తీసుకంటాను. ప్రజల్లో తిరిగిన వాళ్లను వెతుక్కుంటూ వచ్చి పదవి ఇచ్చే బాధ్యత నాది.
• సీనియర్లను గౌరవిస్తా...యువతను ప్రోత్సహిస్తా..పని చేసేవాళ్లను గుర్తిస్తా.

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group





   #Shankharavam #NaraLokesh #Vijayanagaram #PusapatiAshokGajapathiRaj #Vidwamsam #BabuSper6 #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024