అధికారులకు కొత్త టార్గెట్ నిర్దేశించిన సీఎం! ఇప్పటివరకు 70 వేలకు పైగా కుటుంబాలకు..
Wed Jun 04, 2025 21:30 Politics
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పీ4 (ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు-పంచాయతీ) కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల 'బంగారు కుటుంబాలను' మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా 'మార్గదర్శి' నమోదు ప్రక్రియను, దత్తత కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక సంస్కరణల అనంతరం వచ్చిన పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) తరహాలోనే ఇప్పుడు పీ4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నేడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ పీ4 కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ పేరును 'స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్'గా మార్చాలని సూచించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ పీ4 విధానానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులను భాగస్వాములను చేసి, వారికి సంపద సృష్టించామని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: బెంగళూరు తొక్కిసలాట.. చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి! అది మరింత బాధిస్తోంది..
ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని ఒక మార్గదర్శి దత్తత తీసుకుని, వారి అభివృద్ధికి పాటుపడేలా చూడాలని అన్నారు. పీ4 కార్యక్రమ పురోగతిని ప్రతి 10 రోజులకు ఒకసారి స్వయంగా సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు. అనంతరం అధికారులు రూపొందించిన పీ4 లోగో నమూనాలను ఆయన పరిశీలించారు. పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి పలు సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,15,771 కుటుంబాలను 'బంగారు కుటుంబాలు'గా గుర్తించగా, వీరిలో 70,272 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. దత్తత తీసుకున్న కుటుంబాలలో అత్యధికంగా 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని అధికారులు సమావేశంలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
వర్చువల్ సిస్టమ్ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్డేట్ లో లోపం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #ChandrababuNaidu #AndhraPradesh #P4program #Povertyeradication #SwarnandhraP4Foundation #BangaruKutumbalu #Margadarsi #ZeroPoverty #Amaravati #Landacquisition
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.