ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

Header Banner

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

  Mon Aug 26, 2024 17:47        Health

ప్రపంచవాప్తంగా హడలెత్తిస్తున్న మంకీఫాక్స్ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉప్రకమించింది. దుబాయ్నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీఫాక్స్ లక్షణాలు ఉన్నాయనంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు పడకలతో ఓ వార్డును సిద్ధం చేసింది. ఇందులో అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచింది. దేశంలో మంకీఫాక్స్కేసులు పెరుగుతున్నందున ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మంకీ ఫాక్స్ కేసులు నమోదైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఈ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. అన్ని రకాల ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. డబ్యూహెచ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అన్ని విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసి విదేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్ లోని గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఇందుకోసం కోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. తాము పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగా ఏపీలో మొదటిసారిగా విజయవాడలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

 

ఇంకా చదవండిచంద్రబాబును కలిసిన బాబు మోహన్! ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా! 

 

ఈ సమస్య రాగానే జ్వరం, నొప్పులు, విపరీతమైన చలి, చర్మంపై దద్దర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది వచ్చిన వారికి సన్నిహితంగా ఉండడంతో వస్తుంది. చెమట, ఇతర శరీర ద్రవాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, వ్యాధి వచ్చిన వారు వాడే వస్తువులు, బట్టలు, మంచం, దిండు వంటివి వాడడం వల్ల కూడా వస్తుందని పేర్కొంటున్నారు. అయితే మంకీపాక్స్ కోవిడ్ లా ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది. కొవిడ్ సమయంలో వ్యవహరించిన తరహాలోనే అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని పేర్కొంది.

 

ఇంకా చదవండిఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

 

మంకీఫాక్స్ నిర్థరాణ కోసం విశాఖ మెడిటెక్అలి ఆర్టీ పీసీఆర్ కిట్ను రూపొందించింది. ఈ కిట్కు ఐసీఎంఆర్, సీడీఎస్సీవో నుంచి అత్యవసర అనుమతి కూడా లభించింది. కరోనా సమయంలో అనేక దేశీయ ఆరోగ్య సంబధింత ఉత్పత్తులను అందించిన మెన్స్టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ - పీసీఆర్ కిట్ను ఉత్పత్తి చేయడంతో రాష్ట్రానికి ఓ మంచి గుర్తింపు వచ్చినట్లయింది. గత శనివారం ఈ కిట్ను ఆవిష్కరించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరుఈ నెల 24న పిఠాపురంలో భారీగా!

 

విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!

 

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

 

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Health #MonkeyPox #AndhraPradesh #India #MPox