మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా

Header Banner

మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా

  Sat Feb 17, 2024 15:39        Politics

గిరిజన తాండాలకు రోడ్డుసౌకర్యం కల్పిస్తాం!
అత్యవసర సేవలకోసం ఫీడర్ అంబులెన్స్ లు ఏర్పాటుచేస్తాం
గిరిజన గ్రామాల ప్రజలకు యువనేత లోకేష్ భరోసా
ఎస్.కోట: తమ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో అనారోగ్య సంభవించినపుడు ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని ఎస్.కోట నియోజకవర్గం మూలబొడ్డవరం, చిట్టంపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఎస్.కోట శంఖారావం సభకు ముందు యువనేతను ఆ గ్రామాల ప్రజలు కలుసుకొని తమ సమస్యలను విన్నవించారు.

చంద్రబాబు బీజేపీతో పొత్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు... కార్యకర్త కష్టం ఆలోచించారా?? : ఎం ఎ షరీఫ్

మా గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు. కొండపైకి వాహనాలు వెళ్లలేవు. రోడ్డు మంజూరు చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినా ఎటువంటి చొరవ చూపలేదన్నారు. ఇటీవల సంభవించిన ఘటనను వారు వివరిస్తూ... ఇటీవల మా గ్రామానికి చెందిన 23 ఏళ్ల గంగమ్మ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆమె 6 సంవత్సరాల వయస్సు గల కొడుకు అనారోగ్యం పాలయ్యాడు.

వైసీపీకి అంతిమయాత్ర పక్కా! 'X' వేదికగా నారా లోకేష్ ట్వీట్...

స్థానిక వైద్యులు విశాఖ కెజిహెచ్ కి రిఫర్ చేశారు. అతికష్టమ్మీద బాలుడ్ని కెజిహెచ్ కి తీసుకెళ్లగా, ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించాడు. గంగమ్మ కూడా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాలను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ పంపకపోవడంతో గంగమ్మ భర్త ఆటోను అద్దెకు తీసుకున్నాడు. ఆటో డ్రైవర్ ఎస్.కోట వరకు వచ్చి అక్కడి మృతదేహాలను దించి వెళ్లిపోయాడు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

తర్వాత ఆమె భర్త స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని బైక్‌పై మోళబొద్దారం రైల్వేస్టేషన్‌ వరకు 7 కిలోమీటర్లు మోసుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేదు. అవకాశం లేకపోవడంతో గ్రామస్థుల సహకారంతో మృతదేహాలను డోలీపై గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని వాపోయారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మూలబొడ్డవరం, చిట్టంపాడు గ్రామస్తులు యువనేతను కోరారు.

బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???

యువనేత లోకేష్ స్పందిస్తూ... రాష్ట్రంలో పేదలపై కనీసం మానవత్వంలేని ప్రభుత్వం అధికారంలోకి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రతి గిరిజన తండాకు రోడ్డునిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం, అప్పటివరకు ఫీడర్ అంబులెన్స్ లను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

 

మరిన్ని వార్తలు చూడండి:

జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??

నేడే జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం!! సక్సెస్ అయితే రైతన్నకు లాభం!!

 

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #NaraLokesh #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh