జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్న వైసీపీ !! పోలింగ్ బూత్ల వద్ద కూడా రెచ్చిపోయే ప్రమాదం!!

Header Banner

జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్న వైసీపీ !! పోలింగ్ బూత్ల వద్ద కూడా రెచ్చిపోయే ప్రమాదం!!

  Mon Feb 26, 2024 18:25        Exclusives

ఏపీలో వైసీపీ పాలనలో జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్నారు.

నదులు ఉన్నచోట సాండ్ మాఫియా తయారు చేశారు.

నదులలో డ్రజ్జింగ్ పడవలతో ఇసుకను తోడేస్తున్నారు.

ఆ ప్రాంతంలో ఇసుక కార్మికుల ఉపాధికి గండి కొట్టి పర్యావరణానికి తూట్లు పొడిచి మిషనరీ తో ఇసుక రవాణా చేస్తున్నారు.

 

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

జగనన్న కాలనీల పేరుతో వైసిపి నాయకులు గ్రామాలకు దూరంగా అధికారులు విలువ చేయని పల్లపు పొలాలను కొనుగోలు చేసి ఎక్కడ 30 నుంచి 40 లక్షలు ప్రభుత్వ సంపదను కొల్లగొట్టారు.

జగనన్న కాలనీలో మెరక చేయాలంటూ మట్టి మాఫియాను తయారు చేశారు.లంక భూములలో ఉన్న మట్టిని జగనన్న కాలనీలకు అంటూ ఆర్డర్ సృష్టించి లేఔట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.

ఎర్ర మట్టి ఎర్ర గ్రావెల్ కు అనుమతులు లేకుండా తవ్వుకుని అక్రమ రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు.

 

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

 

ఇసుక మాఫియా ఆగడాలకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక యువకుడు రైలు పట్టాలకు బలయ్యాడు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఒక దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లోనే వైసిపి నేతలు శిరముండనం చేశారు.

దళితులకు ఇచ్చిన భూములలో నుండి మట్టి తరలించకపోతున్నారని ఆందోళన చేసిన దళితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.

 

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!

 

విశాఖ జిల్లాలోని అటవీ ప్రాంతానికి పరిమితమైన గంజాయి సాగు నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.

గంజాయి మాఫియాగా తయారై యువకులను వాటికి బానిసలుగా చేసి వైసిపి నేతలు యువతను మత్తులో జోగేలా చేస్తున్నారు.

ప్రభుత్వమే మద్యం మాఫియాను పెంచి పోషిస్తుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మద్యం షాపులలో కేవలం జగనన్న బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం గోవా హర్యానా,యానాం, పాండిచ్చేరి వంటి ప్రాంతాల నుండి తక్కువ రేటుకు బ్రాండెడ్ మద్యాన్ని కొనుగోలు చేస్తే అత్యధిక ధరలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్నారు.

జగనన్న బ్రాండ్ల మద్యం ధరలకు బెదిరిపోతున్న బడుగు బలహీన వర్గాల వారు నాటు సారకు బానిసలుగా మారి ప్రాణాలు కోల్పోతున్నారు.

జగనన్న పాలనలో ప్రతి గ్రామంలోనూ సారాయి బట్టీలు కుటీర పరిశ్రమలు గా పెరిగిపోయాయి.

 

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

 

రాష్ట్రంలోని విలువైన గ్రానైట్ ఏ విధమైన అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు.

రాష్ట్రంలో పలు రకాల మాఫియాలను ఈయన  ప్రభుత్వం పెంచి పోషిస్తుంది.

ఆంధ్రప్రదేశ్, మరియు పక్క రాష్ట్రాల నుండి ఆహార భద్రత కొరకు ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని కాకినాడ కేంద్రంగా రవాణా చేస్తున్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

 

రేషన్ బియ్యాన్ని సానబెట్టి సన్నబియంగా బ్రాండెడ్ సంచులలో ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముతున్న బియ్యం మాఫియా ఆగడాల అంతులేదు.

ఆదాయం వచ్చే అన్ని వ్యవస్థలలోనికి మాఫియాను విస్తరించారు.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఈ మాఫియాల నాయకుల కను సన్న లోనే పనిచేస్తున్నారు.

మాఫియా ఆగడాలను అడ్డుకోవడానికి ఎవ్వరు ప్రయత్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

 

త్వరలో జరగబోయే ఎన్నికలలో పోలింగ్ బూత్ల వద్ద కూడా ఈ మాఫియా రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ అండదండలు పోలీసుల సహకారంతో పెరిగిపోతున్న మాఫియకు చెక్ పెట్టాలంటే ప్రజలు విజ్ఞతతో వ్యవహరించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో విస్తరించిన మాఫియా వ్యవస్థను ఓట్లు రూపంలో పెకలించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6