Header Banner

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ!! చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్!!

  Fri Mar 15, 2024 13:24        Politics

అమరావతి: సమర్థ ఛైర్మన్ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. “ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. ప్రజలకు సేవలందించాలని కొంత మంది గ్రూప్ పరీక్షలకు వస్తారు. మా హయాంలో నిజాయతీ గల వ్యక్తులను ఛైర్మన్ గా నియమించాం. ఇప్పుడు రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ మారిపోయింది. రాష్ట్ర యువతను దుర్మార్గంగా దగా చేసి వారి ఆశలు చంపేశారు. ఛైర్మన్గా నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను మెడపట్టి బయటకు పంపారు. జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ ను  నియమించారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

2018లో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవినీతి రాజ్యమేలింది. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ అయ్యాక దురాలోచనకు తెరలేపారు.వాల్యుయేషన నన్ను దాచిపెట్టి మళ్లీ రెండోసారి చేశారు. రెండో మూల్యాంకనం జరగలేదని కోర్టుకు చెప్పారు. జరిగిందనడానికి ఆధారాలు ఇస్తున్నాం. మాన్యువల్ వాల్యుయేషన్కు వచ్చిన వారి కోసం రూ.20 లక్షలు ఖర్చు పెట్టారు. ఆవాస రిసార్ట్కు ఈ మొత్తం చెల్లించినట్లు బిల్లులు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుంచి కానిస్టేబుళ్లను తీసుకొచ్చారు. క్షమించరాని నేరం చేసిన దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పులేదు. నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాలకంటే ఘోరంగా వ్యవహరించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

నిరుద్యోగులకు వెలుగులు పంచాల్సిన ఏపీపీఎస్సీ చీకట్లు నింపింది. ఫిబ్రవరి 2022లో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేస్తామనలేదా? ఈమేరకు సొంత పత్రిక సాక్షిలో కూడా కథనాలు రాసింది నిజం కాదా? ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామి. మూల్యాంకనం ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారు. అందుకు తగ్గట్టుగా ఛైర్మెన్ స్థాయిలో గౌతమ్ సవాంగ్ సహకరించారు. ఇన్ని అక్రమాలకు తావిచ్చిన ఆయన ఐపీఎస్ కు అనర్హుడు.” అని చంద్రబాబు విమర్శించారు.

 

ఇవి కూడా చదవండి:

కమ్మవారి ప్రత్యేక కార్పొరేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!!

 

టీడీపీ రంపచోడవరం అభ్యర్థి మిరియాల శిరీష దేవి ఎవరో తెలుసా??

 

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు ఫోన్!! విజయవాడ రావాలని పిలుపు!!

 

ఫైబర్ నెట్ కేసులో ఏపీ హోంశాఖ కీలక ఉత్తర్వులు!!

 

సర్వే ఏదయినా కూట‌మిదే విజ‌యం!! వైకాపాకి అంతిమ‌యాత్ర ఖాయం!! నారా లోకేష్

 

Evolve Venture Capital  

 

"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!

 

ఏబీపీ సర్వేలో సంచలన ఫలితాలు!! తెలంగాణాలో ఎవరు??

 

వాలాంటీర్లపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు!!

 

ఎస్‌బీఐ(SBI) ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ!! ఎవరు ఎన్ని బాండ్లో తెలుసా??

 

టీడీపీ రంపచోడవరం అభ్యర్థి మిరియాల శిరీష దేవి ఎవరో తెలుసా??

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #NaraChandraBabuNaidu #APPSC #APGovScam #Groups #AndhraPravasi #Pravasi #2024Election