ప్రసంగంలో మైకులు మొరాయింపుతో అసంతృప్తికి గురైన మోడీ!! చెప్పినా పట్టించుకోని పోలీసులు

Header Banner

ప్రసంగంలో మైకులు మొరాయింపుతో అసంతృప్తికి గురైన మోడీ!! చెప్పినా పట్టించుకోని పోలీసులు

  Mon Mar 18, 2024 07:02        Politics

బొప్పూడి 'ప్రజాగళం' సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే నాలుగుసార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో సభలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా పట్టనట్లు వ్యవహరించారు. ప్రధాని చెప్పినా వారి తీరు మారలేదు. 

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మైకులకు సంబంధించి డీ గ్యాలరీ పక్కనే సిస్టమ్ ఏర్పాటు చేశారు. జనం ఒక్కసారిగా ముందుకు నెట్టుకువచ్చి.. మైకుల సిస్టంపై పడిపోవడంతో అవి మొరాయించాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు స్పందించి వారిని నియంత్రించలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వేదిక పైనుంచి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డికి  పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. మైకు మొరాయించడంపై ప్రధాని సైతం అసంతృప్తికి గురయ్యారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

అంతకుముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు ప్రసంగం సమయంలోనూ మైకులు కొంత సమయం పనిచేయలేదు. మైక్ సిస్టమ్ కు రక్షణ కల్పించలేకపోవడం పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మైకుల సిస్టం ఉన్న ప్రాంతంలో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని కూటమి నేతలు ఆరోపించారు.

 

ఇవి కూడా చదవండి:

దాని తర్వాత ఆంధ్రాలో నా తొలి సభ ఇదే!! “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం!!

 

రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు - రావణ సంహారం జరుగుతుంది!!  ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం

 

ఈసీ (EC) తొలివేటు!! ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు!!

 

జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే !! ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం

 

చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు!

 

సభ అనంతరం చంద్రబాబు పవన్ తో మోడీ భేటీ! బాబు అరెస్టు ఆరోగ్యం పై ఆరా!

 

ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!

 

ఓటర్ల కోసం ప్రత్యేక యాప్!! ఒక్క మెసేజ్ చాలు 100 నిమిషాల్లో మీ ముందు!

 

Evolve Venture Capital  

  

రెండోసారి ఓటు వేయడానికి వస్తే కేస్!! సూర్యాస్తమయం తర్వాత నో ఎంట్రీ!! సీఈసీ!

 

ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ

  

ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #నరేంద్రమోడి #PrajaGalam #PMModi #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh