అమరావతి: జగన్ కు అన్ని అస్త్రాలు అయిపోయి... కుల, మత రాజకీయాలపై పడ్డాడు! ముస్లింలకు మేలు చేసింది.. చేసేది టీడీపీనే.. చంద్రబాబు

Header Banner

అమరావతి: జగన్ కు అన్ని అస్త్రాలు అయిపోయి... కుల, మత రాజకీయాలపై పడ్డాడు! ముస్లింలకు మేలు చేసింది.. చేసేది టీడీపీనే.. చంద్రబాబు

  Mon Mar 18, 2024 19:45        Politics

అమరావతి:- సీఎం జగన్మోహన్ రెడ్డి మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోడికత్తి డ్రామా నుండి బాబాయ్ హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్ ఇప్పుడు మతాలు, కులాలపై పడ్డారని చంద్రబాబు విమర్శించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షిబ్లీతో పాటు పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరడంపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ....జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయం చేసి బోల్తాపడ్డ జగన్ అండ్ టీం... ఇప్పుడు బీజేపీతో పొత్తు అనంతరం మత రాజకీయానికి తెరతీసిందని చంద్రబాబు అన్నారు.

 

ఇంకా చదవండి: ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!

 

టీడీపీ బీజేపీ పొత్తుతో ముస్లీం మైనారిటీలకు నష్టం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలను నమ్మరని, ముస్లిం సంఘాల నేతలు కూడా వైసీపీ మత రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ముస్లింలపై జగన్ కు నిజంగా ప్రేమ ఉంటే రంజాన్ మాసంలో ఇచ్చే రంజాన్ తోఫా కూడా ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ముస్లింలకు ఇచ్చే దల్హన్ పథకం, దుకాన్ మాకాన్ సహా పది సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్...

 

ఇంకా చదవండి: వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

 

ఎన్నికలు రాగానే మత రాజకీయంతో లబ్ధి పొందాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు ఒక్క పథకం అయినా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. మనం కడపలో 90 శాతం పూర్తి చేసిన హజ్ హౌస్ ను కూడా పూర్తి చెయ్యలేకపోయిన జగన్ కు మైనారిటీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ముస్లింల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్లో రాజీ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!

 

జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!

 

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?

 

మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!

 

ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!

 

అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ

 

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

 

సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #NaraLOkesh #Jagan #AndhraPradesh #APPOlitics #APNews #LokeshSpeech #Chandrababu #Pawanakalayan #Janasena #BJP #Amaravati