100 రోజులలో “యార్లగడ్డ”సేవలు అభినందనీయం! జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు!
Sat Oct 05, 2024 14:49 Politicsసీనియర్ టి.డి.పి నేత ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు
రంగన్నగూడెంలో శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు, టి.డి.పి నాయకులు
గన్నవరం నియోజకవర్గంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమని సీనియర్ టి.డి.పి నేత, సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అన్నారు.
గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం రంగన్నగూడెంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్యర్వంలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాం దగ్గర గ్రామ ప్రముఖులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, గ్రామ ఎం.పి.టి.సి సభ్యులు పుసులూరు లక్ష్మినారాయణ తదితరులు గత ఎన్నిక సమయంలో “యార్లగడ్డ”ప్రకటించిన సూపర్ సిక్స్ పధకాలు దిగ్విజయముగా అమలు జరగాలని దుర్గామాతను వేడుకొంటూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇంకా చదవండి: హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!
ఇదే విషయమై ఈరోజు సాయంత్రం రంగన్నగూడెం నుండి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ యార్లగడ్డ వెంకట్రావు గత 100 రోజులలో కఠోరమైన శ్రమ చేసి వివిధ శాఖల అధికారులతో 50 పైగా సమీక్ష సమావేశాలు నిర్వహించి నియోజకవర్గంలో అభివృద్ధికి అవిరళకృషి చేశారని అన్నారు. యార్లగడ్డ ప్రకటించిన సూపర్ సిక్స్ లో భాగంగా బాపులపాడు మండలానికి ఎంతో ఉపయోగమైన మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధిలో భాగంగా అశోక్ లేలాండ్ కంపెనీని తిరిగి ఇక్కడకి తీసుకుని రావటానికి తమిళనాడులోని హౌసూరుకు స్వయంగా వెళ్ళి దాని పునరుద్దరించారని, ఏలూరు కాలువ 60 వేల ఆయకట్టుకు బండారుగూడెం 137 కి.మీ పోలవరం కుడికాలువ నుండి గోదావరి జలాలను తీసుకొనివచ్చే లింకు ఛానల్ కు 2015సం.లో కేటాయించిన 15 కోట్ల అంచనాను జలవనరుశాఖ అధికారులతో మాట్లాడి 32 కోట్లకు ఎస్టిమేట్ పెంచి ప్రస్తుతం టెండర్లు పిలవటానికి విశేషంగా కృషి చేశారని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ, దిశ నిర్ధేశంతో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అండదండలతో రాబోయే 5 సంవత్సరాలలో గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా చేయటానికి యార్లగడ్డ కృషి చేయటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి, ఎస్. పద్మ, రంగన్నగూడెం శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు కొలుసు రంగారావు, దేవరకొండ రాంబాబు, కొలుసు సూరిబాబు, దేవరకొండ సీతయ్య, కాట్రు స్వామి, గ్రామ ప్రముఖులు కాట్రు పాపారావు, మందపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!
ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్కు!
ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?
అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.