సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

Header Banner

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

  Fri Aug 02, 2024 07:00        Politics

ఏపీ రాజకీయాల్లో నిన్న ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకూ ప్రభుత్వాలు నేతల, మంత్రుల పర్యటనల సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగడం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం ఇలా ముందస్తు అరెస్టులు చేయడం, గృహనిర్భంధాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉంటామని ముందే చెప్పింది. ఇందుకు విరుద్దంగా ఓ ఘటన చోటుచేసుకోవడంతో ఏకంగా మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సీఎం చంద్రబాబు నిన్న రాయలసీమలోని మడకశిర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పోలీసులు ఎప్పటిలాగే స్థానిక కమ్యూనిస్టు నేతల్ని, ప్రజా సంఘాల వారిని ముందస్తు అరెస్టులు చేసేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ కు సమాచారం అందింది.

 

ఇంకా చదవండి: పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

దీంతో వెంటనే స్పందించిన లోకేష్.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే ఆయా నేతల్ని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. లోకేష్ అంతటితో ఆగలేదు. మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ఎక్స్ లో ఓ ట్వీట్ కూడా పెట్టారు. ఇందులో సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వబోమని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామన్నారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల్ని లోకేష్ కోరారు. అంతే కాదు ఈ ముందస్తు అరెస్టులపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వానికి రాసిన లేఖను కూడా తన క్షమాపణ పోస్టుకు లోకేష్ జత చేశారు.

ఇంకా చదవండి: రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!


 

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

 

కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!

 

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

 

పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!

 

ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #APpolitics #APPeoples