రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

Header Banner

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

  Sat Aug 03, 2024 18:23        Politics

అమరావతి:- ఫౌర సరఫరాల శాఖపై సిఎం నారా చంద్రబాబు నాయడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని సిఎం అన్నారు. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని సిఎం తేల్చి చెప్పారు. రైతులకు ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని..దీని వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని సిఎం అన్నారు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్ల పాలుచేశారని సిఎం అన్నారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు రూ.21,622 కోట్లు కాగా....5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను రూ.41550 కోట్లకు తీసుకువెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైశాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు.

 

ఇంకా చదవండి: ఆస్తి రూ.500 కోట్లు! రెమ్యునరేషన్ రూ.100 కోట్లు! ఇప్పుడు కారు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో టాలీవుడ్ హీరో! ఎవరో తెలిస్తే షాక్!

 

ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ లో కందిపప్పు ధర రూ.180 రూపాయలు ఉంటే....ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150లకు, బియ్యం కూడా కేజీ రూ.48లకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని అధికారులకు సిఎం సూచించారు. గత తెలుగుదేశం హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని, వాటిని మళ్లీ పునరుద్ధరించాలని అన్నారు. బియ్యం డోర్ డెలివరీ అంటూ చేపట్టిన విధానం కూడా లోపభూయిష్టంగా సాగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని....వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని అధికారులు సీఎంకు వివరించారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ.1,844 కోట్లతో 9260 వాహనాలు కొనుగోలు చేశారని...అయితే ఆ లక్ష్యం నెరవేరలేదని అధికారులు చెప్పారు. ఈ వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్ కు వాడుకున్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. వీటి విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై పలు ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సిఎం చంద్రబాబు సూచించారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

 

గన్నవరం గుండా వల్లభనేని వంశీ అరెస్ట్! కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! లైన్ లో ఉన్న మరి కొంతమంది వైసిపి గుండాలు!

 

11 సీట్లే వచ్చినా మారని సైకో తీరు! ఆయన ఇంటిపై ఉమ్మేసి వెళ్లిన వైసీపీ కార్యకర్త! ఇంత దారుణమా అని అంటున్న సోషల్ మీడియా!

 

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!

 

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

 

కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!

 

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

 

పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!

 

ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples