సీఐడీ అధికారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా, పోలీసులకు..? జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు!

Header Banner

సీఐడీ అధికారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా, పోలీసులకు..? జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు!

  Sat Sep 21, 2024 09:00        Politics

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుపై గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారిగా పనిచేసిన విజయ్ పాల్ పై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అప్పటి సీఐడీ అధికారి విజయ్ పాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రఘురామ కృష్ణరాజు అదే పార్టీ ఎంపీ అన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జగన్ కు వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా బహిరంగంగా ఆరోపణలు చేసిన అప్పటి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్లిపోయారు. తరువాత ఢిల్లీ, హైదరాబాదులోనే ఎక్కువ రోజులు కాలం గడిపిన రఘురామ కృష్ణరాజు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేసి ఆ తర్వాత జైలుకు పంపించారు తనను అరెస్టు చేసిన సమయంలో తనను పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టారని, అప్పటి సీఐడీ అధికారులు టీఎస్ఆర్ ఆంజనేయులు, విజయ్ పాల్ తదితరులు తనను చిత్రహింసలకు గురి చేశారని, పోలీస్ స్టేషన్లో పెట్టి తనను కొట్టారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు: ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది! చరిత్రలో ఎన్నడూ చూడనంత

 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అప్పటి సీఐడీ అధికారులు ఆంజనేయులు, విజయ్ పాల్ తదితరులపై రఘురామ కృష్ణరాజు గుంటూరులో కేసు పెట్టారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ1వగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో ఏ1గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటికి సీఐడీ అధికారి విజయ్ పాల్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర, హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అప్పుడు సీఐడీ అధికారులుగా పనిచేసిన ఆంజనేయులు, జయపాల్ తదితరులు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ క్లైట్ ను వేధింపులకు గురి చేశారని, గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు తప్పుడు పనులు చేశారని, అందుకే పోలీసు అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారని రఘురామ కృష్ణరాజు న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. అప్పుడు పోలీసు అధికారులు తప్పులు చేశారని కొందరిని సస్పెండ్ చేశారని, ఈ కేసులో ముందస్తు విజయ్ పాల్ ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సమంజసం కాదని రఘురామ కృష్ణరాజు న్యాయవాదులు హైకోర్టుకు మనవి చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో ఈనెల 24వ తేదీన ఈ కేసులో ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి విజయ్ పాల్ కు ఇప్పుడు టెన్షన్ మొదలైందని సమాచారం.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu