పాకిస్తాన్ కొత్త పీఎం షాక్! అక్రమాల వెనుక సీఈసీ, సీజే హస్తం.. భారీగా రిగ్గింగ్.. పాక్ ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్!

Header Banner

పాకిస్తాన్ కొత్త పీఎం షాక్! అక్రమాల వెనుక సీఈసీ, సీజే హస్తం.. భారీగా రిగ్గింగ్.. పాక్ ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్!

  Mon Feb 19, 2024 11:28        World

పాకిస్థాన్‌లో పరిస్థితి మారడం లేదు. ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభంతోపాటు ఉగ్రదాడులు, వరుస హత్యలతో సతమతం అవుతున్న పాక్‌లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడితే పరిస్థితి మెరుగవుతుందని భావించిన వారి ఆశలు గల్లంతయ్యాయి.

 

ఇంకా చదవండి:  ఈ పెళ్లి వేడుక ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ హర్షం వ్యక్తం! జోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన పెళ్లి!

 

ఎన్నికలతో సమస్యలు తీరుతాయి అనుకుంటే… మరిన్ని కొత్త సమస్యలు రావడం ప్రస్తుతం పాక్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అంగీకరిస్తూ తాజాగా సీనియర్ ఎన్నికల అధికారి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

 

ఇంకా చదవండి:  కొడాలి నానికి బిగ్ షాక్!! గుడివాడలో వేడెక్కిన రాజకీయం!!

 

ఈ నేపథ్యంలోనే పాక్ ఎన్నికల కమిషన్ ఒక హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల అక్రమాల వెనుక సీఈసీ, సీజే హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 మంది అభ్యర్థులు ఓడిపోయినా... వారిని విజేతలుగా ప్రకటించినట్లు రాజీనామా చేసిన అధికారి చెప్పడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.

 

 ఇంకా చదవండి:  ఆరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్! సమన్లు చట్ట వ్యతిరేకం!

 

దీంతో పాక్ ఎన్నికల భవితవ్యం ఏంటి అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. పాక్‌ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన వేళ... అక్కడి సోషల్‌ మీడియాపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్‌లో ఎక్స్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి:  సిద్ధం సభల్లో ఏరులై పారుతున్న మద్యం!! ఆకలితో అల్లాడిపోతున్న పోలీసులు!!

 

ఇక పాకిస్థాన్ ఎన్నికల్లో అక్రమాల వ్యవహారంలో ఏకంగా పాక్ ఎన్నికల సంఘం, చీఫ్ జస్టిస్ ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ రిగ్గింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఓ హై లెవల్ కమిటీని నియమించింది. ఈ అంశంపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో సీఈసీ సికందర్‌ సుల్తాన్ రజా పాల్గొన్నారు.

 

ఇంకా చదవండి:  'ఢిల్లీ ఛలో' కార్యక్రమాన్ని నిలిపివేసిన రైతులు!!

 

ఎన్నికల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా ఏర్పాటైన హై లెవల్ కమిటీ ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసి… వాటి ఆధారంగా 3 రోజుల్లో నివేదికను ఎన్నికల కమిషన్‌కు అందించనుంది. ఇక ఈ ఎన్నికల అక్రమాల ఆరోపణలను రావల్పిండి ఎన్నికల కమిషనర్‌ సయీఫ్‌ అన్వర్‌ జప్పా పూర్తిగా ఖండించారు.

 

ఇంకా చదవండి:  సౌదీ: రికార్డ్ స్థాయిలో వెల్లివిరుస్తున్న టూరిస్టులు! ఎన్నో ఆకర్షణలు, ఆఫర్లు! UN నివేదిక ప్రకారం!

 

ఎన్నికల్లో తమ పాత్ర కేవలం అందర్నీ సమన్వయం చేయడం వరకే ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పాక్ సైనిక నాయకత్వం ఉండే రావల్పిండిలో దాదాపు 13 మంది అభ్యర్థులను ఓడిపోయినా... బలవంతంగా విజేతలుగా ప్రకటించామని రావల్పిండి మాజీ కమిషనర్‌ లియాఖత్‌ అలి ఛత్తా ఆరోపించడం పెను సంచలనం సృష్టించింది.

 

ఇంకా చదవండి:  మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి!! ఖండించిన నారా లోకేష్

 

మరోవైపు... పాక్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే వార్తలు గుప్పుమంటున్న వేళ... అక్కడ సోషల్ మీడియా సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్స్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని నెట్‌బ్లాక్స్ అనే సంస్థ తెలిపింది. పాక్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని...

 

ఇంకా చదవండి:  నేడు (19-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

 

దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ… సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత వారం జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో అత్యధికంగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని పీటీఐ మద్దతు గల అభ్యర్థులు 93 మంది విజయం సాధించారు.

 

ఇంకా చదవండి:  దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ ?- చంద్రబాబు సవాల్!!

 

అయితే మేజిక్ ఫిగర్ రాకపోవడంతో... బిలావల్ భుట్టో నేతృత్వంలోని పీపీపీ... మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీలు... మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే తమకే పూర్తి మెజార్టీ వచ్చినా... ఫలితాలను ఆలస్యంకా ప్రకటించి ఫలితాలను తారుమారు చేశారని పీటీఐ నేతలు ఆరోపించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే స్టేషన్లో ఇలాంటి పనులు చేస్తే జరిమాన తప్పదు! ఈ రూల్స్ పాటించాల్సిందే! మీకు ఇది తెలుసా!

 

యూకె: భారతీయుల కొరకు ప్రత్యేకంగా 3000 వీసాలు! అర్హతలు ఇవే! లాటరీ బేస్!

 

పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!

 

స్వీడన్: నిరుద్యోగులకు శుభవార్త! జీతం లో 80%! సంవత్సరం పాటు పండుగే!

 

బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం! నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pakistan #Politics #PakistanPolitics #PoliticsResultWrong #Politics #FormerPrimeMinisterNawazSharif