శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

Header Banner

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

  Tue Sep 17, 2024 07:00        Politics

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పెండింగ్ రేషన్ కార్డులకు తెర పడనుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 50 వేల రేషన్ కార్డుల మాత్రమే మంజూరు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎక్కువగా ఆరు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డులకు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడం.. తాజాగా రైతు రుణమాఫీకి ఆధారం రేషన్ కార్డునే తీసుకోవడంతో.. రేషన్ కార్డుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. గత ఐదారు సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. అంతే కాకుండా.. కొత్తగా పెళ్లైన వారు ఈ నాలుగేళ్లలో చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులతో కాకుండా.. కొత్తగా కాపురం పెట్టిన వారు.. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేశారు. వీటి మంజూరు కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర పడనుంది.

 

ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు మోదీ శుభవార్త! సికింద్రాబాద్, విశాఖకు ప్రయాణంలో వేగవంతమైన మార్గం!

 

అక్టోబర్ నెలలో రేషన్ కార్డులను మంజూరు చేస్తామని మంత్రులు ఉత్తమ్ , పొంగులేటి వెల్లడించారు. అర్హులైన వారి డేటాను స్క్రుటినీ చేస్తున్నారు. దీని తర్వాత పెండింగ్ దరఖాస్తులో అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఎమ్మార్వో ఆఫీస్, మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇక కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు..  కానీ.. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు మాత్రం మీ సేవాలో చేసుకోవచ్చన్నారు. ఇక రేషన్ కార్డుతో పాటు.. హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ లోనే హెల్త్ కార్డులను కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు. నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం మంత్రులు మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం రేషన్ కార్డులు రాష్ట్రంలో 90 లక్షల మేర ఉన్నాయి. అందరికీ ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం 50 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అవి కూడా ఉప ఎన్నికలు నిర్వహించిన నియోజకవర్గాలోనే అని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్రమంతా ఏ నాడు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. తాము పారదర్శకంగా.. అర్హత ఉన్న వారికి రేషన్ కార్డలు జారీ చేస్తామన్నారు.  దీనిపై ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుందన్నారు. ఈ నెలాఖరులోగా కేబినెట్ కమిటి రిపోర్ట్ ఇస్తుంది. అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.

 

ఇంకా చదవండి: అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్త, వెంటనే అప్లై చేసుకోండిలా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

 

కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu