స్టెమ్ సెల్ టెక్నాలజీ! దీంతో టైప్ 1 డయాబెటిస్ ను నయం చేయవచ్చా?

Header Banner

స్టెమ్ సెల్ టెక్నాలజీ! దీంతో టైప్ 1 డయాబెటిస్ ను నయం చేయవచ్చా?

  Tue Oct 01, 2024 20:02        Health

మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇబ్బందుల పాలు చేస్తున్న అనారోగ్య సమస్య. ఈ మధ్య కాలంలో పెద్దవారు మాత్రమే కాకుండా యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోల్చుకుంటే భారతదేశంలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య అత్యధికంగా ఉన్నాయి. రాబోయే 20 సంవత్సరాలలో, ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ వ్యాధిని నిర్మూలించేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.

 

గ్లూకోజ్ని నియంత్రించడానికి శరీరం తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది అనేక కారణాల వల్ల జరగవచ్చు. అలాంటప్పుడే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగి మధుమేహం వస్తుంది. ఇలా పెరిగిన గ్లూకోజ్ శరీరంలోని అన్ని అవయవాల పై ప్రభావం చూపుతుంది. క్రమంగా అన్ని అవయవాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

మధుమేహం రెండు రకాలు, ఒకటి టైప్-1, మరొకటి టైప్-2. సరైన జీవనశైలి లేని కారణంగా కాలక్రమేణా వచ్చే టైప్-2 మధుమేహం, చిన్నప్పటి నుంచి వచ్చే టైప్-1 మధుమేహం వస్తుంటాయి. ఈ రెండు రకాల మధుమేహం కూడా ప్రమాదకరమే అయినప్పటికీ, టైప్ 1 బాల్యంలో సంభవిస్తుంది కాబట్టి పిల్లల పై అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటి వరకు, ఈ రెండు రకాల మధుమేహానికి శాశ్వత చికిత్స అనేది అస్సలు సాధ్యపడలేదు. ఇన్సులిన్ను బయట నుంచి ఇవ్వడం ద్వారా గ్లూకోజ్ నియంత్రించవచ్చు. అయితే ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు టైప్-1 డయాబెటిస్ చికిత్సకు స్టెమ్ సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

 

నిజానికి, మూలకణాలు దెబ్బతిన్న కణాలను సరిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కణాలకు ఎలాంటి డ్యామేజ్ అయినా సరిచేసే అపారమైన శక్తి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. చైనా శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ టెక్నాలజీతో టైప్-1 మధుమేహానికి మందు కనిపెట్టారు. తాజా పరిశోధన ప్రకారం శాస్త్రవేత్తలు కూడా ఈ సాంకేతికత ద్వారా ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకు నయం చేస్తారని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే మొదటి కేసుగా పేర్కొంటున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిహైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్‌! అక్టోబర్‌ 6 నుంచి ఆ స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు! 

 

 

చైనీస్ న్యూస్ అవుట్లెట్ ప్రకారం గత 20 సంవత్సరాలుగా టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 25 ఏళ్ల మహిళ ది పేపర్, కొత్త ఇన్వాసివ్తో సుమారు రెండున్నర నెలల తర్వాత తన షుగర్ స్థాయిలను నియంత్రించగలిగింది. శస్త్రచికిత్స తరువాత ఈ టైప్-1 మధుమేహం రోగిని పూర్తిగా నయం చేయడంలో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ సహాయపడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ టెక్నిక్లో రోగి శరీరం నుండి కణాలు తీసుకుంటారు. వాటిని ల్యాబ్కు తీసుకెళ్లి అనేక మార్పులు చేస్తారు. ఈ కణాలను తిరిగి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇన్సులిన్ పనితీరు టైప్-1 మధుమేహాన్ని నయం చేయడంలో ఓ మార్గం కనిపించింది.

 

ఈ సర్జరీకి డాక్టర్లు అరగంట మాత్రమే సమయం తీసుకుంటారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ శస్త్రచికిత్స అనంతరం శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతతో చాలా సంతృప్తి చెందారు. విష్యత్తులో ఈ సాంకేతికత ద్వారా టైప్ 1 డయాబెటిస్ చికిత్స పై ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు. ఇది నిజంగా జరిగితే డయాబెటిస్కు వ్యతిరేకంగా ఇది పెద్ద విజయం అవుతుందంటున్నారు. ఇది టైప్-2 డయాబెటిస్కు నివారణను కనుగొనడంలో కూడా చాలా సహాయపడుతుందని చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Health #Diabetes #SugarLevels #BloodSugar #DiabetesPatients