అమెరికాలో లే ఆఫ్ సమస్యతో పాటు మరికొన్ని కొత్త సవాళ్లు! భారతీయులకు కష్టంగా మారిన హెచ్-1బీ నిబంధనలు! ముఖ్యంగా తెలుగు వారికి!
Sun Sep 29, 2024 07:58 U S Aవీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అమెరికన్ టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్ల ప్రభంజనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ పరిణామాలు ఇండియన్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలు ఉన్నవారి పరిస్థితి వర్ణనాతీతం. ఈ ధోరణితోపాటు కఠినమైన వీసా నిబంధనలను ప్రవేశపెట్టడం, దరఖాస్తు ధరను విపరీతంగా పెంచేయడం వల్ల అమెరికాలోని భారతీయ వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం గల కార్మికులకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది.
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్! ఇకపై ఆ కొత్త రూల్ అమలు!
ఇటీవల దాదాపు 438 టెక్ కంపెనీలు సుమారు 1,37,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. దీంతో ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకుని నిలిచే కోట అని టెక్ రంగంపై గతంలో ఉన్న భావం చెదిరిపోతున్నది. ఉద్యోగాల కొరత వల్ల హెచ్-1బీ వీసాదారులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. వీరు నిర్దిష్ట సమయంలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకోగలగాలి లేదంటే, అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
అమెరికా వీసా విధానాల్లో ఇటీవల వచ్చిన మార్పులు ఇండియన్ వర్కర్ల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ విడుదల చేసిన 2024 అక్టోబర్ వీసా బులెటిన్ రానున్న ఆర్థిక సంవత్సరానికి అందుబాటులో ఉండే ఇమిగ్రెంట్ వీసాల సమాచారాన్ని వెల్లడించింది. ఇది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ సహా వివిధ వీసా క్యాటగిరీల్లోని దరఖాస్తుదారులకు ఆందోళనను రేకెత్తించింది. కొన్ని రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడి పెట్టినవారు రెసిడెన్సీ పొందేందుకు ఇన్వెస్టర్ వీసా అవకాశం కల్పిస్తుంది. కానీ చైనా, భారత్ నుంచి వచ్చే దరఖాస్తులకు ఈ అవకాశాలు అందడంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము ఒక లబ్ధిదారుకు 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరిగింది. అంటే 2,150 శాతం పెరిగిందన్న మాట! పేపర్ ఫైలింగ్ రుసుము 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. ఓ వైపు ఉద్యోగాల పరిస్థితి అనిశ్చితంగా ఉండగా, ఇంత భారీగా రుసుములు పెరగడం దరఖాస్తుదారులకు గుదిబండగా మారింది. గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు కూడా నిబంధనలు మారాయి. ఐ-30 పిటిషన్ పేపర్ సబ్మిషన్కు రుసుము 675 డాలర్లకు, ఆన్లైన్లో దాఖలు చేస్తే వసూలు చేసే రుసుము 625 డాలర్లకు పెరిగింది, అసైలమ్ పిటిషన్లకు కొత్తగా 600 డాలర్ల ఫీజును నిర్ణయించారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేస్తే, పాస్పోర్టులకు సంబంధించి అదనపు తనిఖీలను ఎదుర్కోవాల్సి వస్తున్నది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!
ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు!
సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ!
తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.