బ్రిటిష్ కాలంనాటి చట్టాలకు ముగింపు! అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు! మోడీ సర్కార్ కీలక నిర్ణయం!

Header Banner

బ్రిటిష్ కాలంనాటి చట్టాలకు ముగింపు! అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు! మోడీ సర్కార్ కీలక నిర్ణయం!

  Mon Jul 01, 2024 10:09        India

బ్రిటిష్ వలస పాలన కాలంనాటి చట్టాలకు ముగింపు పలుకుతూ, న్యాయవ్యవస్థలో కీలక మార్పులను తీసుకువస్తూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం (జూలై 1) నుండి అమలులోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC) , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (IEA) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినీయం (BSA) దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. 

 

 

ఈ మార్పులతో జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్ లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ ల ద్వారా సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడమే కాకుండా "రాజద్రోహం" అనే పదాన్ని తొలగించారు. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో "దేశద్రోహం" అనే కొత్త పదాన్ని చేర్చారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడుతాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే సత్వర న్యాయం అందించడానికే ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా తెలిపారు. వలసవాద నేర న్యాయ చట్టాలకు ముగింపును సూచిస్తూ అందరికీ న్యాయం చేయాలన్న తలంపుతో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. 

 

చట్టాలు కేవలం పేరు మార్పుకు మాత్రమే పరిమితం కావని, చట్టాల్లో పూర్తి సవరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఈ నూతన చట్టాలను పూర్తిగా భారతీయులే రూపొందించారని దీని ఆత్మ, శరీరం పూర్తిగా భారతీయమేనని అన్నారు. ఈ కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని నిర్దేశిస్తాయని హోం మంత్రి తెలిపారు. ఈ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తైన 45 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుండి 60 రోజులలోపు అభియోగాలు నమోదు చేయాలి. 

 

ఇంకా చదవండి: అప్పుడు అధికార అహంకారంతో విర్రవీగిన జగన్! ఇప్పుడు దర్పం లేక రగిలిపోతున్న మామూలు MLA! అయినా కుక్క తొక వంకరే - బుద్ధి మారదు!

 

అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాలి. అత్యాచార బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లో రావాలి. పిల్లలను కొనడం, విక్రయించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మైనర్ పై సామూహిక అత్యాచారానికి జీవిత ఖైదీ లేదా మరణశిక్ష విధిస్తారు. భారతీయ శిక్షాస్మృతిలోని 511 సెక్షన్ల స్థానంలో ఇప్పుడు 358 సెక్షన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

 

18 సెక్షన్లు ఇప్పటికే రద్దు చేశారు. సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో - వీడియో సాక్ష్యాలు అన్నింటిని జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన డీజీ లాకర్ లో భద్రపరుస్తారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాలను ఆన్లైన్ ద్వారా పంపుతారు దీని వల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు. పెండ్లి చేసుకుంటాను అనే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచిపెట్టే వారికి కూడా కొత్త చట్టాల్లో కఠిన నిబంధనలు రూపొందించారు. 

 

ఇంకా చదవండి: మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం! 

 

జీరో ఎఫ్ఐఆర్ ను ప్రవేశపెట్టడం వల్ల ఒక వ్యక్తి అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి, బాధితులు కేసు పురోగతిపై 90 రోజులలోపు అప్డేట్ పొందేందుకు అవకాశం కల్పించారు. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి. ఆర్దిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర - చరాస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంది. 

 

ఇవి కూడా చదవండి 

లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి! 

 

ప్రజలకి మంచి చేయకపోవడమే కాకుండా, చేసేవారి మీద బురదజల్లే ప్రయత్నం! వైసీపీ ఇంకా ఎంతకి దిగజారుతుందో తెలియట్లేదు! 

 

రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ! ఏటా అయ్యే ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

రైతులకు అన్యాయం జరిగితే సహించం! కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!

 

మోదీ సర్కార్ కు షాక్ ఇచ్చిన నితీశ్ కుమార్! హోదా కావాలంటూ తీర్మానం! 

  

థాంక్యూ సర్ అన్నందుకు విమానం నుంచి దించేశారు! అసలు కారణం ఏంటో తెలుసా! 

 

ఇదెక్కడి సైకోఇజం రా బాబు! పాటలు వింటే ఉరితీస్తారా! పూర్తి కథ ఏంటో చూసేయండి! 

  

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే! 

                                                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group  


   #AndhraPravasi #Politics #India #Indians #Modi #CentralGovernment #NDAGovernment