సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

Header Banner

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

  Thu Jul 04, 2024 07:00        Politics

ఏపీ సీఎం చంద్రబాబు ఈ శనివారం నిర్వహించనున్న ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతి శనివారం ప్రజా సమస్యలు వినడంతో పాటు వినతులు స్వీకరించాల్సిన నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రజా వేదిక పేరుతో ఇప్పటికే రెండు శనివారాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఈసారి మాత్రం అనూహ్యం ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా పడింది. సీఎం ఢిల్లీ పర్యటన, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ నేపథ్యంలో శనివారం ప్రజా వినతులను స్వీకరించడంలేదని అధికారికంగా పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ శనివారం కాకుండా పై వచ్చే వారంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా వేదిక కార్యక్రమాన్ని కొనసాగించనున్నారని స్పష్టం చేశారు. ఈ నెల 6న టీడీపీ కార్యాలయానికి ప్రజలు రావొద్దని పిలుపునిచ్చారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను గురువారం కలవనున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ బయల్దేరారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు కలువనున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. అమరావతి, పోలవరం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానితో పాటు కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక అందించనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ నెల 6న హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా శనివారం జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రామాన్ని వాయిదా వేశారు.

 

ఇవి కూడా చదవండి

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

 

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు! 

 

ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!

 

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

 

అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!

 

నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!

 

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

 

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

 

ఏపీకి పారిశ్రామిక రాయితీలు! రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు! రోడ్లు, పోలవరానికి ప్రత్యేక నిధులు! నేడే చంద్రబాబు ఢిల్లీ టూర్! 

 

సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ! 

 

కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

                                                                                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group  


   #AndhraPravasi #Politics #TDP #AndhraPradesh #CBN #Amaravathi #Mangalagiri #CMCBN