చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!

Header Banner

చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!

  Sat Jul 06, 2024 07:00        Politics

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శనివారం) ముఖాముఖీ భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రజా భవన్ వేదికగా శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న రెండు రాష్ట్రాల సీఎంల భేటీ అజెండా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫేస్ టూ ఫేస్ భేటీలో రాష్ట్ర విభజనకు సంబంధించిన మొత్తం 10 అంశాలపై చర్చించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించినట్లు సమాచారం. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్లోని ఆస్తుల విభజనతో పాటు విభజన చట్టంలో ప్రస్తావన లేని సంస్థల పంపకాలపై చర్చించనున్నట్లు టాక్. వీటితో పాటుగా ఏపీఎస్ఎఫ్సీ, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల మార్పిడి, వృత్తిపన్ను పంపకం, హైదరాబాద్ లోని భవనాల తిరిగి అప్పగింత, ఉమ్మడి సంస్థల వ్యయాల తిరిగి చెల్లింపునకు సంబంధించిన టాపిక్ పై డిస్కషన్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రేపటి ఇద్దరు సీఎంల భేటీకి ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్రెడ్డి, కందుల దుర్గేష్ ఈ భేటీలో పాల్గొననున్నట్లు టాక్. వీరితో పాటు ఏపీ సీఎస్, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు రానున్నట్లు సమాచారం. తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి ఈ భేటీలో పాల్గొననున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రేవంత్, చంద్రబాబుల భేటీకి ముందు ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. పదేళ్లుగా పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై చర్చ జరగనున్న ఈ కీలక భేటీలో రెండు రాష్ట్రాల మధ్య ఉప్పు-నిప్పులా ఉన్న కృష్ణ జలాల నీటి వాటాల పంపిణీ అంశం జోలికి వెళ్లొద్దని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణ జలాల నీటి వాటాలపై తెలంగాణ, ఏపీ మధ్య ఎప్పటి నుండో వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

బ్రిజేష్ ట్రిబ్యూనల్ తో పాటు కోర్టుల్లోనూ ఈ అంశానికి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్ పై రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్లారు. రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా బలగాలను మోహరించడంతో సాగర్ డ్యామ్ వద్ద పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ నేపథ్యంలోనే ఇంతటి సీరియస్ ఇష్యూపై రేవంత్, చంద్రబాబుల ముఖాముఖీ భేటీలో చర్చించొద్దని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఈ టాపిక్ పై డిస్కషన్ జరగదని ప్రచారం జరుగుతోంది. మరి, బాబు, రేవంత్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత కీలకమైన కృష్ణా నది జలాల పంపకం ఇష్యూపై చర్చిస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

 

ఇవి కూడా చదవండి

మరోసారి సొంత నియోజకవర్గంలో చెప్పులు, రాళ్ళు వేయించుకోడానికి రెడీ అవుతున్న జగన్ రెడ్డి! కారణం ఏంటో తెలుసా!

 

లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు! 

 

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం! 

 

రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!

 

వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్! 

 

జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

 

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

 

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

                                                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AP #AndhraPradesh #Telangana #TG #APGovernment #TGGovernment #CBN #CMCBN #RevanthReddy #APTGCMs