సీఎం చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం! రుణ ప్రణాళిక విడుదల! పలు అంశాలపై సబ్ కమిటీ

Header Banner

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం! రుణ ప్రణాళిక విడుదల! పలు అంశాలపై సబ్ కమిటీ

  Tue Jul 09, 2024 17:45        Politics

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్ బీసీ) జరిగింది. ఈ సమావేశంలో... 2024-25 సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించారు. రూ.3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు కేటాయించారు. రూ.1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్ల రుణాల లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యవసాయ రంగానికి గతం కంటే 14 శాతం అధిక రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయంలో యాంత్రీకరణ, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు రూ.32,600 కోట్లను కేటాయించారు. ఎంఎస్ఎంఈలకు ఈ ఏడాది 26 శాతం అధికంగా రుణాలు ఇవ్వనున్నారు. గృహనిర్మాణ రంగంలో రూ.11,500 కోట్ల రుణాలు, సంప్రదాయేతర ఇంధన రంగంలో రూ.8 వేల కోట్లు రుణాలు ఇచ్చేలా ప్రణాళికలో పేర్కొన్నారు. సాగు ఖర్చుల తగ్గింపు, కౌలు రైతులకు రుణాలు, పంటల బీమా, పీ-4 ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం, డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

 

ఇంకా చదవండి: రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహ్రెయిన్ మరియు సౌదీలలో ట్రావెల్ రంగానికి చెందిన ఉద్యోగాల అవకాశం! ఆకర్షణీయమైన జీతం! వెంటనే అప్లై చేసుకోండి!

 

ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!

 

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!

 

ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

 

మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?

 

మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!

 

అమరావతి ORR వలన రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారనున్నది! ప్రాజెక్టు పూర్తి విశేషాలు! జరగబోయే మార్పులు! ఆ ప్రాంతాల వారికి పండగే!

 

అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #Chandrababu #MaryMatha #Gunadala #Telugudesam #cbnsir #chadrababuandwife #marymathacbnsirvisit