రోజా కనిపించని చెత్త.. అహంకారం! షాకింగ్ వీడియో వైరల్! చేసిన పనికి జగన్ కు తలనొప్పి!

Header Banner

రోజా కనిపించని చెత్త.. అహంకారం! షాకింగ్ వీడియో వైరల్! చేసిన పనికి జగన్ కు తలనొప్పి!

  Wed Jul 17, 2024 14:20        Politics

ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఎప్పుడూ వార్తలలో నిలిచిన రోజా వ్యవహార శైలి ఇప్పుడు మళ్లీ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. సామాన్యులపై రోజా చిన్నచూపును వ్యక్తం చేసే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తెలుగుదేశం పార్టీ రోజాపై దుమ్మెత్తి పోస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడులోని తిరెచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం రోజు వరుణాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి తన భర్త అయిన సెల్వమణితో కలిసి హాజరైన మాజీ మంత్రి రోజా స్వామివారిని దర్శించుకున్నారు. రోజా సినీ సెలబ్రిటీ కావడంతో అక్కడ ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఆలయంలో రోజాను చూసిన చాలా మంది భక్తులు ఆమెతో కలిసి సెల్ఫీలు దిగారు. ఇక వారందరినీ నవ్వుతూ పలకరించిన రోజా సెల్ఫీలకు ఫోజులిచ్చారు. అయితే అక్కడే పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు కొందరు రోజాతో కలిసి సెల్ఫీ దిగాలని ఆమె వద్దకు చాలా ఆశతో వచ్చారు. అయితే రోజా దగ్గరకు వస్తున్న పారిశుద్ధ కార్మికులను ఉద్దేశించి దూరంగా జరగమన్నట్టు చేతితో సైగ చేశారు. రోజా సైగలతో దగ్గరికి రాకుండా ఆగిపోయిన పారిశుద్ధ కార్మికులు దూరంగా నిలబడే రోజాతో సెల్ఫీలు దిగారు. మిగతా వారందరితో దగ్గరగా సెల్ఫీలకు ఫోజులు ఇచ్చిన రోజా పారిశుద్ధ్య కార్మికులను దూరం పెట్టడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 

ఇంకా చదవండి: అధికారం మారిన అవే పనులు! వారికి వైసీపీ నేతలు కొమ్ముకాస్తున్నారని..

 

ఆమె అహంకారం పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోజాను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు లేని ఒక రోజును రోజు ఊహించుకోవాలని సవాల్ విసురుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తేనే మన రోడ్లు, మన ఊర్లు, మన నగరాలు శుభ్రంగా ఉంటున్నాయని, అటువంటి వారిని దూరంగా ఉండాలని రోజా సైగలు చేయడం ఆమెపై విమర్శలకు కారణం కాగా, ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీకి మరో తలనొప్పిగా మారింది. గతంలో టిడిపి ప్రభుత్వం పైన మాటిమాటికి విరుచుకుపడిన రోజా పైన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ అసహ్యంగా హావభావాలు పెట్టి అవమానించిన వైసీపీ నేత రోజా రెడ్డి పైన తమిళ మీడియా దుమ్మెత్తిపోస్తుంది అంటూ టిడిపి అధికారిక ఖాతాలో రోజాకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనికి తెలుగు తమ్ముళ్లు ఘాటుగా రోజాపై పోస్టులు పెడుతున్నారు. రోజాది కనిపించని చెత్త.. పారిశుద్ధ్య కార్మికుల కంటే ఆమె చెత్తనే ఎక్కువ అంటూ ఘాటుగా పోస్టల్ పెడుతున్నారు.


ఇంకా చదవండి: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!

 

గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!

 

ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!

 

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!

 

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!

 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా!

 

ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

 

మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Roja #AndhraPradesh #APpolitics #RojaViralvideo #Temple