శ్రీరాముడి గుడి రథానికి నిప్పు పెట్టిన కేసులో ట్విస్ట్! వైసీపీ నేత అరెస్టు!
Wed Sep 25, 2024 19:12 Politicsఅనంతపురం జిల్లాలోని కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామంలో రాములవారి ఆలయ రథానికి నిప్పంటించడం ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. రథానికి నిప్పు పెట్టిన వారిని పట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి రాముల వారి రథానికి నిప్పు పెట్టిన తీరును పరిశీలించారు. పోలీసు అధికారుల దర్యాప్తులో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం అనంతపురం సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. రాముల వారి ఆలయం రథానికి ఈనెల 23వ తేదీన అర్దరాత్రి నిప్పు పెట్టిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఈశ్వర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. అయితే ఈ కేసులో కులం, మతం, పార్టీలకు సంబంధించిన ఎలాంటి గొడవలు లేవని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. జిల్లా ఎస్పీ జగదీష్ కథనం మేరకు ఫ్యామిలీ గొడవలు కారణంగానే శ్రీ రాముల వారి రథానికి నిప్పు పెట్టారని తెలిసింది. హనకనహాళ్ కు చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రూ 20 లక్షల రూపాయల ఖర్చు పెట్టి శ్రీ రాముల వారి ఆలయానికి 2022లో గతంలో రథం తయారు చేయించారని జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు.
ఇంకా చదవండి: అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
రథం తయారు చేయడానికి ఎర్రిస్వామి రెడ్డి సోదరులు ఆ గ్రామంలో ఏలాంటి విరాళాలు సేకరించి లేదని, వారి సొంత డబ్బులతోనే రాముల వారి ఆలయానికి రథాన్ని చేయించారని జిల్లా ఎస్పీ జగదీష్ వివరించారు. ఇటీవల ఎర్రిస్వామి రెడ్డి సోదరుల మధ్య శ్రీ రాములవారి గుడి రథం విషయంలో మనస్పర్థలు వచ్చాయని అన్నారు. కుటుంబ గొడవల కారణంగా ఎర్రిస్వామి రెడ్డి కుమారుడు ఈశ్వర్ రెడ్డి రగిలిపోయాడని, ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి పెట్రోల్ తీసుకెళ్లి రథం మీద పోసి నిప్పంటించాడని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. షెడ్డులో మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు గుర్తించి వెంటనే మంటలు ఆర్పేవేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రథం కొంతవరకు కాలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ దర్యాప్తు జరిపారు. ఈ కేసులో ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఈశ్వర్ రెడ్డి వైసీపీ కార్యకర్త అయినా రాముల వారి రథానికి నిప్పంటించిన కేసులో పార్టీలకు గాని, కుల మతాలకు గాని ఎలాంటి సంబంధం లేదని, కుటుంబ గొడవల కారణంగా ఈ సంఘటన జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియా చెప్పారు. అయితే ఈ కేసులో ఈశ్వరరెడ్డితో పాటు ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు.
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!
మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!
ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?
వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!
మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!
రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..
ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!
విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!
అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Temple #Fire #AndhraPradesh #YCP #appolitics
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.