రాజేంద్రపసాద్‌ ఇంటికెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్‌! గాయత్రి మరణం రాజేంద్రప్రసాద్‌కు తీరని లోటు!

Header Banner

రాజేంద్రపసాద్‌ ఇంటికెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్‌! గాయత్రి మరణం రాజేంద్రప్రసాద్‌కు తీరని లోటు!

  Sat Oct 05, 2024 17:28        Politics

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో త్రీవ విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. ఆయన ఏకైక కుమార్తె గాయత్రి (38) ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. కూతురు మరణంతో రాజేంద్రప్రసాద్ తీవ్ర విషాదంలో వున్నారు... ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు రాజేంద్రప్రసాద్ కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మరణం తమను ఎంతో కలిచి వేసిందని, ఈ బాధ నుండి ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు. ఇక రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనను షాకింగ్‌కు గురిచేసిందని అల్లు అర్జున్ స్పందించారు.

 

ఇంకా చదవండి: తిరుమలలో రూ.13.40 కోట్లతో వకుళమాత వంటశాల! ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఆ విషయంలో రాజీ పడేది లేదు!

 

ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కూకట్‌పల్లిలోని గాయత్రి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తనకు నటుడిగా, వ్యక్తిగా ఎంతో ఆప్తులైన, అత్యంత ఇష్టుడైన రాజేంద్రప్రసాద్ గారికి ఇలాంటి కష్టం రావడం దురదృష్టకరమని, గాయత్రి మరణం చాలా విషాదకరమని అల్లు అర్జున్ తెలిపారు. గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి అల్లు అర్జున్‌, జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాలలో కలిసి నటించారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AlluArjun #Rajendraprasad #gayathri