భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు! కారణం ఏంటంటే!

Header Banner

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు! కారణం ఏంటంటే!

  Thu Oct 03, 2024 11:39        Business

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకొనడం గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లలోనూ ఈ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ (గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

 

ఇంకా చదవండిఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి!  

 

సెన్సెక్స్ ఏకంగా 1,264.2 పాయింట్లు పతనమై 83,002.09 వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ-50 సూచీ 345.3 పాయింట్లు దిగజారి 25,451.60 వద్ద ఆరంభమైంది. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ కాస్తంత కోలుకొని 954.50 పాయింట్లు అంటే 1.13 శాతం నష్టంతో 83,311.69 పాయింట్ల కదలాడుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచీ 11 గంటల సమయానికి 295.80 పాయింట్లు అంటే 1.15 శాతం నష్టపోయి 25,501.00 వద్ద ట్రేడ్ అవుతోంది. 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగొచ్చని, చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడొచ్చనే భయాందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రతికూలంగా మార్చాయి. మార్కెట్లలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు మొగ్గుచూపారు.  చమురు, గ్యాస్, ఉక్కు, బ్యాంకింగ్‌తో పాటు ఇతర రంగాల షేర్లలో అమ్మకాల జోరు కనిపించింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గ్లోబల్ మార్కెట్లలోనూ అనిశ్చితి పరిస్థితులు నెలకున్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. అయితే బ్యాంకింగ్ రంగ షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇక జపనీస్ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Business #Stocks #StockMarkets #MarketCrash