ఈ దేశానికి వెళ్లాలంటే ఇప్పుడు రెండు వారాల్లోనే వీసా! వెల్లడించిన విదేశాంగ మంత్రి!

Header Banner

ఈ దేశానికి వెళ్లాలంటే ఇప్పుడు రెండు వారాల్లోనే వీసా! వెల్లడించిన విదేశాంగ మంత్రి!

  Sat Aug 17, 2024 11:38        Europe

జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి శుభవార్త. జర్మనీ వర్క్ వీసా ప్రాసెస్ చేయడానికి ఇంతకు ముందు తొమ్మిది నెలల వరకూ సమయం పట్టేది. వర్క్ వీసీ ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నైపుణ్యం కల్గిన కార్మికుల శిక్షణపై ప్రభావం చూపుతోంది. జర్మనీలో భారీ పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలు త్వరిత వీసాలపై ఆధారపడతాయి. ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయకపోతే జర్మనీ ఆర్ధిక వ్యవస్థ 74 బిలియన్ యూరోల నష్టాన్ని చవిచూస్తుందని జర్మన్ ఎకనామిక్ ఇన్ స్టిట్యూట్ పేర్కొంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం ఫెడరల్ విదేశాంగ కార్యాలయం ఈ ఏడాది జూన్ వరకూ 80వేల వర్క్ వీసాలను జారీ చేసింది. వీరిలో 50 శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. 

 

ఇంకా చదవండి'రెడ్ బుక్' పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్! అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? 

 

ఇంకా చదవండిమాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ నేపథ్యంలో తమ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు తక్షణం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్ బాక్ వెల్లడించారు. ఈ డిమాండ్ ను పరిష్కరించడానికి వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. జర్మన్ ఎకనామిక్ ఇన్ స్టిట్యూట్ 2023 డేటా ప్రకారం జర్మనీలో దాదాపు 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. దీంతో భారతీయుల దీర్ఘకాలిక వీసాలకు త్వరలో ఆమోదం తెలుపుతామని జర్మనీ తెలిపింది. వర్క్ వీసా ప్రాసెసింగ్ ను ఇప్పుడు కేవలం రెండు వారాలకు తగ్గించనున్నారు. కాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రెండు రోజుల క్రితం జర్మన్ ఎంపీలు జుర్గెన్, రాల్ప్ బ్రింకాస్ లతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. డిల్లీలో జుర్గెన్ హార్డ్, రాల్ఫ్ బ్రింకాస్ లతో తాను చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటేవీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Europe #EuropeNews #Germany #SkilledWork #GermanyVisa