సీనియర్ నటుడు: ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే! ఆయ‌న‌తో ఒక మంచి ఆలోచ‌నను పంచుకుంటాను!

Header Banner

సీనియర్ నటుడు: ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే! ఆయ‌న‌తో ఒక మంచి ఆలోచ‌నను పంచుకుంటాను!

  Mon Oct 07, 2024 10:11        Entertainment

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు అపాయింట్‌మెంట్ ఇస్తే త‌న వ‌ద్ద ఉన్న ఒక అద్భుత‌మైన ఆలోచ‌న‌ను ఆయ‌న‌తో పంచుకుంటాన‌ని విల‌క్ష‌ణ న‌టుడు షాయాజీ షిండే అన్నారు. ఆల‌యాల్లో ప్ర‌సాదంతో పాటు భ‌క్తుల‌కు ఒక మొక్క‌ను ఇస్తే బాగుంటుంద‌ని, తాను ఇప్ప‌టికే ఈ ప‌ని చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. సుధీర్ బాబు హీరోగా వ‌స్తున్న 'మా నాన్న సూప‌ర్ హీరో' మూవీలో షాయాజీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ద‌స‌రా సందర్భంగా ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. దీంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బిగ్‌బాస్ సీజ‌న్‌-8లో హీరో సుధీర్ బాబుతో క‌లిసి షాయాజీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈ విల‌క్ష‌ణ న‌టుడి గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని పంచుకున్నారు. ఖాళీ ప్ర‌దేశం క‌న‌ప‌డితే చెట్లు నాటు‌తార‌ని వ్యాఖ్యాత నాగార్జున‌తో అన్నారు. దీంతో నాగ్ ఇలా షాయాజీ మొక్క‌లు నాట‌డం వెనుక ఉన్న కార‌ణాన్ని ఆయ‌న్ను అడిగారు. అప్పుడు షాయాజీ షిండే మాట్లాడుతూ.. త‌న తల్లి 1997లో క‌న్నుమూసిన‌ట్లు తెలిపారు.

 

ఇంకా చదవండి: కొండా సురేఖ విషయంలో నాగార్జున నో కాంప్రమైజ్.. హాట్ డిబేట్! పరువు నష్టం దావా తీర్చనున్నారా?

 

ఆమె బ‌తికి ఉన్న స‌మ‌యంలో త‌న వ‌ద్ద ఇంత డ‌బ్బు ఉన్నా ఆమెను బ‌తికించుకోలేను.. నేనేం చేయ‌ను అని బాధ‌ప‌డ్డాను. అప్పుడే త‌న‌కు ఒక ఆలోచ‌న వ‌చ్చింద‌ని, దాన్ని త‌న అమ్మ‌తో పంచుకున్న‌ట్లు తెలిపారు. అదే.. త‌న అమ్మ‌ బరువుకు స‌మాన‌మైన విత్త‌నాలను తీసుకుని, దేశం మొత్తం నాటుతాన‌ని ఆయన అన్నార‌ట‌. తాను నాటిన విత్త‌నాలు చెట్లుగా మార‌డంతో పాటు నీడ‌ను పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూసిన‌ప్పుడ‌ల్లా త‌న‌కు త‌న అమ్మ‌ గుర్తుకు వ‌స్తార‌ని తెలిపారు. దీన్ని ఆల‌యాల్లో వ‌చ్చే భ‌క్తుల ద్వారా చేప‌డితే ఇంకా బాగుంటుంద‌ని ఆలోచించి మ‌హారాష్ట్ర‌లోని మూడు దేవాల‌యాల్లో ప్రారంభించిన‌ట్లు షాయాజీ చెప్పుకొచ్చారు. అయితే, గుడికి వ‌చ్చే అంద‌రికీ కాకుండా ఎవ‌రైతే అభిషేకం చేస్తారో వారితో సుమారు 100 నుంచి 200 మందికి ప్రసాదంగా వీటిని ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఒక‌వేళ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ ఇస్తే, ఆయ‌న్ను క‌లిసి ఈ వివ‌రాల‌న్నీ చెబుతాన‌ని అన్నారు. దేవుడి ప్ర‌సాదంలానే మొక్క‌ల‌ను అంద‌రికీ పంచాలని, అవి నాటితే పెరిగి చెట్లు అవుతాయ‌న్నారు. త‌ర్వాత అవి ఏడు జ‌న్మ‌ల‌కు పెరుగుతూనే ఉంటాయ‌ని షాయాజీ చెప్పడంతో ఆయ‌న ఆలోచ‌న అద్భుతంగా ఉందంటూ నాగార్జున ప్ర‌శంసించారు. ఈ విష‌యంలో మీకు త‌ప్ప‌కుండా ప‌వ‌న్ అభిమానులు సాయం చేస్తార‌ని నాగ్‌, సుధీర్‌బాబు ఆయ‌న‌తో చెప్పారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #SayajiShinde #Pawankalayan #AndhraPradesh #Tollywood